హయత్నగర్ : ‘‘పురాతన కట్టడాలకు రక్షణ కల్పిస్తూ, వాటి పూర్వ వైభవానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, హయత్ నగర్ లోని పురాతన హయత్ బక్షీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.2.50 కోట్లు కేటాయించిందని టూరిజం, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధి హయత్నగర్ డివిజన్లోని పురాతన కట్టడం అయిన హయత్ బక్షీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బోగారపు దయానంద్, ఎంఆర్ డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిలతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ చారిత్రక కట్టడాల ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని, రాష్ట్రంలోని వారసత్వ సంపదను భద్రపరుస్తూ వాటికి గుర్తింపు తీసుకువస్తున్నారని మంత్రి అన్నారు. ఇందులో భాగంగా రామప్ప దేవాలయం, కుతుబ్షాహీ టూంబ్స్, హయత్ బక్షీకి గుర్తింపు వచ్చేలా కృషి చేశారన్నారు.
హయత్ బక్షీ ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. వంద సంవత్సరాల చరిత్ర గల కట్టడాన్ని కాపాడుకు నేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తూ, పర్యాటక కేంద్రానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. అనంతరం హయత్ బక్షీ లో పర్యటించి అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయా పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ చారిత్రక కట్టడం అభివృద్ధిలో భాగంగా రూ.2.50 కోట్లతో పనులు చేపట్టామని పేర్కొన్నారు. పార్కులు, సీసీ కెమెరాలు, లైట్లు, ఫౌంటేన్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో హయత్నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్, టూరిజం శాఖ ఈడీ శంకర్రెడ్డి, ఓఎస్డీ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ పంకజ, హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.