ఆదిలాబాద్ రూరల్, జూన్ 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలు గుర్తించి బేసిక్ పే ఇవ్వాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయమని జిల్లా కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల సంఘం నాయకులు గాజుల శ్రీనివాస్, పన్నాల సంజీవ్రెడ్డి అన్నారు. పట్టణంలోని కలెక్టరేట్ సమీపంలోని జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా బేసిక్ పే ఇవ్వాలని నిర్ణయించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నో ఏండ్లుగా ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో పనిచేస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించిన అధ్యాపకులను గుర్తించి వేతనాలు పెంచడంలో సహకరించిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్ కమిషనర్ ఉమర్ జలీల్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు దేవేందర్, నారయణ్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సుభాష్, సంతోష్, రుపేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, రమణ రెడ్డి పాల్గొన్నారు.
ఉట్నూర్ మండలం లాల్టెక్డిలో..
ఉట్నూర్ రూరల్, జూన్ 18 : మండలంలోని లాల్టెక్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కాం ట్రాక్ట్ లెక్చరర్లు కళాశాల ఆవరణలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ బాధలు తెలుసుకొని ఆదుకున్నందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు శ్రీనివాస్, కృష్ణ, మురళి, లింగేశ్వర్, వీరాబాబు, వేణు, రాజ్కిరణ్, రాధ, సునీల్ పాల్గొన్నారు.