షాద్నగర్టౌన్, జనవరి 18: పేదలకు సీఎం సహాయనిధి వరంలా మారిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని వివేకానందకాలనీకి చెందిన గంధం శ్యామ్సుందర్ అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 2.50లక్షల చెక్కును మంగళవారం ఆయన బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అదే విధంగా చటాన్పల్లికి చెందిన రవీందర్గౌడ్కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.60వేల చెక్కును అందజేసి మాట్లాడారు. ప్రజా ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, నాయకులు ఉన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
కొందుర్గు, జనవరి 18: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం కొందుర్గు మండల కేంద్రం, జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడల పట్ల ఆసక్తి చూపడం సంతోషకరమైన విషయమన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత క్రీడలతో పాటు విద్యపై శ్రద్ద చూపాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, వైస్ ఎంపీపీ రాజేష్పటేల్, అక్రమ్, నర్సింగరావు, జబ్బార్, వెంకటేశ్ పాల్గొన్నారు.