ధాన్యం కొనుగోలుపై కేంద్రం కొర్రీలు
రైతుల పక్షాన హైదరాబాద్లో నేడు గులాబీశ్రేణుల మహాధర్నా
హాజరుకానున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు
ఖమ్మం, నవంబర్17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కర్షకుల కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు గురువారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునివ్వడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా బయలుదేరాయి. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులందరూ ధర్నాకు హాజరుకానున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ద్వంద్వ వైఖరి, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ఎండగడుతూ మరో పోరాటానికి సిద్ధం కావడంతో రైతులు టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్కు అండగా ఉంటామని ముక్త కంఠంతో పేర్కొంటున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తున్న కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు టీఆర్ఎస్శ్రేణులు సమాయత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ గురువారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టనున్న మహాధర్నాకు ఉమ్మడి ఖమ్మం నుంచి ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరుకానున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకుండా పంటల విషయంలోనూ బీజేపీ నేతలు రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై యుద్ధం ప్రకటించింది.
రైతుల అసంతృప్తి
ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారత ప్రాంతం. వానకాలం, యాసంగి పంటలు పండించడంలో జిల్లా రైతులు మంచి ప్రావీణ్యం ఉంది. యాసంగిలో పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం ససేమిరా అంటుండడంతో రైతులు టీఆర్ఎస్ ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాకు రైతుల నుంచి భారీగా స్పందన వచ్చింది. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కదం తొక్కారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ తీసుకొస్తున్న ఒత్తిడికి అన్నదాతలు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సింది పోయి రైతులను రెచ్చగొట్టేలా ప్రకటనలు, పర్యటనలు చేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసినప్పుడు.. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎందుకు వివక్ష చూపుతున్నదని సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.
ధర్నాకు హాజరుకానున్న నేతలు
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పాల్గొననున్న ధర్నాలో ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియానాయక్, కందాళ ఉపేందర్రెడ్డి, లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు కూరాకూల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు పాల్గొననున్నారు.
బీజేపీ డ్రామాలు సాగవ్
యాసంగి, వానకాలం ధాన్యాన్ని కేంద్రమే కొనాలి. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు బంధు ఇస్తున్నది. కేంద్రం కనీసం వడ్లు కూడా కొనలేదా.? రైతుల కోసం మీరేం చేస్తున్నారు.. చేస్తారో చెప్పండి. ధర్నాకు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వంద మంది రైతులను బస్ మీద తీసుకెళ్తున్నాను. వారితోపాటు ఎంపీపీలు రైతు సమన్వయ కమిటీ చైర్మన్లు, సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి వెళ్తున్నాం. మా డిమాండ్ ఒక్కటే.. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రైతులపై దౌర్జన్యం చేస్తే ఊరుకోం. ప్రతీ గింజా కేంద్రమే కొనుగోలు చేయాలి. వడ్లు కొనుగోలు చేయకపోతే ఢిల్లీలో ప్రధాని మోడీకి మా పిలుపు వినపడే వరకు పోరాటాలు చేస్తాం. తాడోపేడో తేల్చుకుంటాం. ఇందిరా పార్క్లో రైతులంతా కలిసి ధర్నా చేస్తాం. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. మాట వినకపోతే తగిన బుద్ధి చెబుతాం.
కేంద్రానిది మోసపూరిత వైఖరి..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత వైఖరి అవలంబిస్తున్నది. యాసంగి ధాన్యం కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట అన్నట్లుగా వ్యవహరిస్తుండడం దారుణం. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులకు అండగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్లోనూ ఇదే విధంగా పోరాధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికో నీతి, పూటకో మాట అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. రైతుల ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ఎందాకైనా వెళ్తున్నది. బీజేపీని విడిచి పెట్టేది లేదు. వెంటాడుతాం.. వేటాడుతాం.. ధాన్యం కొంటారా? కొనరా.? స్పష్టం చేయాలి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వకుంటే అన్ని వేదికలపైనా పోరాటం చేస్తాం. యాసంగిలో వరి వేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉన్నారో లేదో చెప్పాలి.. తప్పుగా చెప్పి ఉంటే ముక్కు నేలకు రాయాలి. రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి..
కేంద్ర ధోరణి సమస్యాత్మకంగా మారింది. ఇలాంటి సమయంలో మనం కర్షకులకు అండగా నిలవాలి. వారిని అన్ని విధాలా ఆదుకోవాలి. కేంద్రం వద్దంటే వరిని కొనే పరిస్థితి లేదు. ధాన్యంతో కష్టాల దృష్ట్యా రైతులను అప్రమత్తం చేయాలి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రైతులకు వాస్తవాలు తెలియజెప్పి వారిలో చైతన్యం తీసుకురావాలి.