‘పేట’ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై కాంగ్రెస్ దాడికి నిరసనగా ర్యాలీ
తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన టీఆర్ఎస్ నాయకులు
అశ్వారావుపేట, సెప్టెంబర్ 16 : అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను కఠినంగా శిక్షించాలని జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ జూపల్లి రమేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు బండి పుల్లారావు, బండారు శ్రీనివాసరావు కోరారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై రాళ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గిరిజన ఎమ్మెల్యేను అసభ్య పదజాలంతో దూషించిన నాయకులపై ఎట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం రింగ్ రోడ్డు సెంటర్లోని తెలంగాణతల్లి విగ్రహం వద్దకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. అనంతరం తెలంగాణతల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశా రు. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా సంత మార్కెట్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మా ట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల రౌడీ సంస్కృతిని ప్రతిఘటిస్తామని అన్నారు. ఇతర మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ప్రత్యక్ష దాడులకు పాల్పడ్డారని అన్నారు. బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పాల్పడడమే కాకుండా గిరిజన ఎమ్మెల్యేను దూషిస్తారా అంటూ మండిపడ్డారు. డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, అశ్వారావుపేట సొసైటీ అధ్యక్షుడు నూతక్కి నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ చిట్లూరి ఫణీంద్ర, టీఆర్ఎస్ నాయకులు కోటగిరి సీతారామస్వామి, చిన్నంశెట్టి సత్యనారాయణ, యూఎస్ ప్రకాశ్రావు, బిర్రం వెంకటేశ్వరరావు, సత్యవరపు సంపూర్ణ, పసుపులేటి ఫణీంద్ర, కలపాల శ్రీనివాసరావు, మందపాటి రాజమోహన్రెడ్డి, సోమాని శ్రీనివాసరావు, బండారు సాయి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.