హరితహారంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలి
వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
నిర్మల్ టౌన్, జూన్ 16: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, పల్లె ప్రగతి పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బుధవారం వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా అటవీశాఖాధికారులు వీడియో కాన్ఫరెన్స్లోపాల్గొన్నారు. హరితహారంలో భాగంగా 2021-22 సంవత్సరానికిగాను వివిధ శాఖల ద్వారా నాటే మొక్కల లక్ష్యాలను ఆయా జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. త్వరలో చేపట్టబోయే హరితహారంలో పెద్ద ఎత్తున మొక్క లు నాటి, సంరక్షించాలని సీఎస్ సూచించారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
హరితహారానికి ప్రణాళికలు సిద్ధం
ఎదులాపురం,జూన్16: హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ప్రణాళికలు సిద్ధం చేశామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హరితహారం, ధరణి, వ్యాక్సినేషన్, తదితర అంశాలపై బీఆర్కే భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రంలోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు, డీపీవో,డీఆర్డీఏ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో మల్టీ లేయర్లో మొక్కలు నాటడం, అటవీ బ్లాక్లు ఏర్పాటు చేయడం, జిల్లాలో నాలుగు మెగా నర్సరీలను పదెకరాల చొప్పున ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా మల్టీలేయర్ క్రమంలో పెద్ద మొక్కలు నాటుతామని వివరించారు. జిల్లాలోని 1176 జీపీల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పట్టణ ప్రకృతివనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలో సూపర్ స్ప్రె డర్లకు వ్యాక్సినేషన్ అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి డోస్ 61,264 మందికి, రెండో డోస్ 18,906 మందికి వేసినట్లు వెల్లడించారు. ధరణి వెబ్సైట్కు అందిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తున్నామని వివరించారు. పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాం తాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, డీఆర్డీఏ పీడీ కిషన్, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాధన, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ ఈఈలు మహావీర్, నర్సయ్య, మున్సిపల్ అసిస్టెంట్ సీవీఎన్ రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.