కొందుర్గు, జనవరి 16 : కొందుర్గు మండల కేంద్రంలో ఆదివారం జరిగిన క్రికెట్ టోర్నమెంట్ను మండల వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్ టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లోనూ రాణించడం ఎంతో సంతోషకరమైన విషమన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. క్రీడా స్ఫూర్తితో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
యువత క్రీడల్లోనూ రాణించాలి
నందిగామ : నందిగామ మండల పరిధిలోని వెంకమ్మగూడ గ్రామంలో ఆదివారం జరిగిన కబడ్డీ పోటీల్లో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా చేగూర్ పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్ హాజరై గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, గ్రామాల్లో ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడం వల్ల యువతకు ఆటలపై మరింత ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, దేవప్ప, వడ్డే శ్రీను, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీపటేల్గూడలో క్రికెట్ పోటీలు
ఇబ్రహీంపట్నంరూరల్ : ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి పటేల్గూడ గ్రామంలో క్రికెట్ టోర్నీని కౌన్సిలర్ నారని మౌనిక ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య, వార్డు అధ్యక్షుడు నర్సింహాగౌడ్, నాయకులు వెంకటేశ్, నరేశ్, రాంరెడ్డి, రమేశ్, రాజశేఖర్, రాము, రాజు తదితరులున్నారు.
నందివనపర్తి ్రగ్రామంలో..
యాచారం: నందివనపర్తి గ్రామంలో బీఎన్రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలను ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తితో పోటీపడాలని సూచించారు.
ముగిసిన వీపీఎల్ క్రికెట్ టోర్నీ
తలకొండపల్లి : మండలంలోని వెల్జాల్ గ్రామం లో నాలుగు రోజులుగా జరిగిన వీపీఎల్ క్రికెట్ టోర్నీ ముగిసింది. మొదటి బహుమతి రూ. 8116, రెండో బహుమతి రూ. 5116 అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ రహమాన్, ఎంపీటీసీ అంబా జీ, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసమూర్తి, నిర్వాహకులు అజీజ్, రమేశ్, మురళి, ప్రకాశ్, సుదర్శన్, శ్రీను, శేఖర్ పాల్గొన్నారు.
ఇనాంగూడలో ముగిసిన క్రీడలు
అబ్దుల్లాపూర్మెట్ : క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని సర్పంచ్ అంతటి యశోద అన్నారు. ఇనాంగూడ గ్రామంలో ఇనాంగూడ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పేరుతో నిర్వహించిన క్రికెట్ టోర్నీ ఆదివారం ముగిసింది. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.