ప్రత్యామ్నాయ పంటలే మేలు
అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వం
వచ్చే యాసంగి నుంచి తగ్గింపు
నూనె గింజల సాగుకు ప్రాధాన్యం
పామాయిల్, వేరుశనగ, పొద్దుతిరుగుడు, శనగలు, ఆవాలతో అధిక లాభాలు
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగా ణ) : వరికి ఇక గడ్డు కాలమే. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నది. వడ్లు కొనుగోలు చేయమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మార్కెట్లో నూనె గింజలకు అధిక ధర లభిస్తుండడంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, లాభం వచ్చే నూనె గింజల సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నది. దీంతో రైతులు వచ్చే యాసంగి నుంచి వరి సాగు తగ్గించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ కూడా రైతులకు అవగాహన కల్పించేలా ముందుకు సాగుతున్నది.
వరి సాగుకు గడ్డు కాలం ఏర్పడనున్నది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండిం గ్ ప్రాజెక్టుల పూర్తితోపాటు వ్యవసాయానికి అందుతున్న చేయూతతో ఉమ్మడి పాలమూరులోని నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా రైతు లు వరిని అధికంగా సాగు చేసి లాభాలు అర్జిస్తున్నా రు. అయితే, కేం ద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రభు త్వ రంగ సంస్థ ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. కేంద్రం వద్ద రానున్న ఐదేండ్ల కా లానికి సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నట్లు పేర్కొన్న ది. దీంతో కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయమ ని తెలిపింది. దీంతో ప్రభుత్వం, మిల్లర్లు ధాన్యం కొ నుగోలు చేసేందుకు ఇబ్బందులు పడనున్నది. ఈ నే పథ్యంలో రాష్ట్రంలో రైతులు వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం పేర్కొంటున్నది. రెండు రోజుల కిందట సీఎం కేసీఆర్ సైతం ఇదే విషయంలో అధికారులకు వివరించారు. ప్రస్తుత వానకాలంలో సాగును మినహాయిస్తే యాసంగి నుంచి వరిని పూర్తిస్థాయిలో త గ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు నూనె గింజలు పండించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నా రు. ప్రధానంగా వేరుశనగ, శనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు, ఆముదాలతోపాటు కూరగాయల సాగు చేపట్టాలి. వరికి అధికంగా నీళ్లు కావాల్సి ఉంటుంది.
ఈ పంట చేతికి రావడానికి ఆరు నెలల సమయం పడుతుంది. వరుసగా వరి సాగు చేస్తుండడంతో భూసారం కూడా దె బ్బతింటున్నది. పంటల మార్పిడి జరిగితే దిగుబడి అధికంగా వచ్చే అవకాశమున్నది. కాగా, నూనె గిం జల సాగుకు తక్కువ నీటితోపాటు స్వల్ప కాలిక వ్య వధిలోనే పంటలు చేతికి వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో నూనె గింజలకు డిమాండ్ ఉన్నది. వేరుశనగ, పామాయిల్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రోత్సాహకాలు అందజేస్తున్నది. ప్రైవేట్ కంపెనీలే నేరుగా రైతుల వద్దకు వచ్చి పామాయిల్ పంటను కొనుగోళ్లు చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నా గర్కర్నూల్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 221 ఎకరాల్లో పామాయిల్ సాగవుతున్నది. వచ్చే ఏడాది వె య్యి ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత వానకాలంలో రైతులు వరి సాగు చేస్తున్నా.. కొనుగోళ్లు కష్టంగా మారనున్నాయి. దీంతో యాసంగి నుంచి వరికి బదులు నూనె గింజలు పండించాలని ప్రభుత్వం సూచిస్తున్నది.
ఎఫ్సీఐ నిర్ణయం రైతులకు ఉరిలా మారనున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో 2020-21 యాసంగి సీజన్లో 218 కొనుగోలు కేంద్రాలతో 36,700 మంది రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.527 కోట్ల విలువైన 2,79,456 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గత వానకాలం సీజన్లో 195 కొనుగోలు కేంద్రాలతో 13,954 మంది రైతుల నుంచి రూ.168 కోట్ల విలువైన 89,318 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుత సీజన్లో వరి సాగు అంచనా 33,300 ఎకరాలు కాగా.. 98.01 శాతంతో 32,638 ఎకరాల్లో వరి సాగు చేయడం గమనార్హం. ఇక అత్యధికంగా పత్తి 3,57,362, మొక్కజొన్న 43,819, కందులు 9,589, జొన్న 2,344 ఎకరాల్లో సాగవుతున్నాయి. నూనె గింజల సాగు అంతంత మాత్రంగానే ఉన్నది. ప్రభుత్వ నిర్ణయంతో రానున్న కాలంలో నూనె గింజల సాగుపై వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోనున్నది. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెఢ్డి నిరంజన్రెడ్డి సైతం జిల్లాలో జరిగిన సమావేశాల్లో వరికి ప్రత్యామ్నాయంగా నూనె గింజలు సాగు చేయాలని కోరారు. నూనె గింజల పంటలు స్వల్పకాలంలో తక్కువ నీటి వనరులతో స్వల్ప వ్యవధిలోనే చేతికి వస్తుందని వివరించారు.
నూనె గింజలకు అధిక ధర..
ఎఫ్సీఐ ధాన్యం కొనుగోళ్లు చేయమని తెలిపింది. ఈ క్రమంలో రైతులు వరికి బదులుగా నూనె గింజల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మార్కెట్లో నూనె గింజలకు అధిక ధర లభిస్తున్నది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, లాభం వచ్చే నూనె గింజల సాగు చేపడితే మంచిది.