కృష్ణ, సెప్టెంబర్ 13 : ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని డాక్టర్ శ్రీమంత్ అన్నారు. సోమవారం మండలకేంద్రంతోపాటు ఐనాపూర్, హిందూపూర్, మూడుమాల, కున్సి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన మెగా శిబిరంలో 18 ఏండ్లు పైబడిన వారికి టీకా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలో టీకా తీసుకు నే వారికి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రజలకు మరింత చే రువగా గ్రామాల్లో శిబిరాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వ్యాక్సి న్ సురక్షతమన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, గ్రామా ల కార్యదర్శులు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ముమ్మరంగా వ్యాక్సినేషన్
ఊట్కూర్, సెప్టెంబర్ 13 : కరోనా వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నది. మండలంలోని మల్లేపల్లి లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్ను సర్పం చ్ మాణిక్యమ్మ సందర్శించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ వ్యాక్సిన్పై అపోహలు వీడి అందరూ వేయించుకోవాలని సూచించా రు. టీకాపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఉ పసర్పంచ్ బాలస్వామి, ఏఎన్ఎం అంబుబాయి, ఎల్టీ శ్రీనివాస్రెడ్డి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
తప్పనిసరిగా తీసుకోవాలి
నర్వ, సెప్టెంబర్ 13 : ప్రజలందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని ఎంపీపీ జయరాములుశెట్టి అన్నారు. మండలంలోని యాంకి, సీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వ్యాక్సిన్ సెంటర్ను ఏర్పా టు చేయించి టీకా పంపిణీ చేయిస్తున్నామన్నారు. అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని కరోనా బారిన పడకుండా తమను తాము సంరక్షించుకోవాలన్నారు.
వ్యాక్సిన్ వేసుకోవాలి
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 13 : కొవిడ్ నుంచి రక్షణ పొందాలంటే 18 ఏం డ్లు పూర్తయిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయి ంచుకోవాలని కౌన్సిలర్ అనిత, టీఆర్ఎస్ నాయకులు సుభాశ్ అన్నారు. పట్టణంలోని 2వ వార్డులో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సిన్తోనే కరోనాను కట్టడి చేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ మోనేశ్, ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
కొనసాగుతున్న టీకా పంపిణీ
మాగనూర్, సెప్టెంబర్ 13 : గ్రామాల్లో టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. మండలంలోని పరమ న్దొడ్డి, కొల్పుర్, తాళంకెరి గ్రామాల్లో టీకా మెగా శిబిరం ఏర్పాటు చేసి 18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సిన్ వేశామని మండల వైద్యాధికారి తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్ర తిఒక్కరికీ టీకా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పే ర్కొన్నారు. కొవిడ్ రాకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ ఎ లాంటి భయబ్రాంతులకు గురికాకుండా టీకాలు వేసుకోవాలన్నారు. మొత్తం 902 మందికి టీకా వేశామన్నారు. సర్పంచులు, కార్యదర్శులు, ఏఎన్ఎంలు పాల్గ్గొన్నారు.