ఊట్కూర్, నవంబర్ 12: యాసంగిలో పండించే వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని సర్పంచుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సూర్యప్రకాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన రైతు మహా ధర్నా కార్యక్రమానికి మండలకేంద్రంతోపాటు పరిసర గ్రామాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగా ణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపెడుతున్నదని ఆరోపించారు. ఇబ్బంది పెట్టకుండా ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, మా జీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, రైతు బంధు సమితి మండ ల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్గౌడ్ పాల్గొన్నారు.
ధర్నాకు భారీగా తరలిన టీఆర్ఎస్ శ్రేణులు
కృష్ణ, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి నాయకత్వంలో మక్తల్ నియోజక వర్గంలో శక్రవారం నిర్వహించిన ధర్నాకు మండల కేంద్రం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులు భారీ సంఖ్యలో బయల్దేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు విజయ్పాటిల్, జెట్పీటీసీ అంజనమ్మపాటిల్, ఎంపీపీ పూర్ణిమాపాటిల్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మోనేశ్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధక్షుడు శివప్ప, యువనాయకులు శివరాజ్పాటిల్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వరి కుప్పలపై కూర్చొని నిరసన
ధన్వాడ, నవంబర్ 12: ధన్వాడ మండలం ఎంనోన్పల్లి గ్రామంలో శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరి కుప్పలపై కూర్చొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. గున్ముక్ల, మంత్రోన్పల్లి, ఎంనోన్పల్లి గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులతోపాటుగా రైతుల నిరసన చేపట్టారు. కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ వడ్ల కొనుగోలు విషయంలో అయోమయానికి గురి చేస్త్తూ రైతు వ్యతిరేక చట్టాలను ప్రయోగిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ భారతి, మాజీ ఎంపీటీసీ గౌని శ్రీనివాసు లు, సచిన్తోపాటు టీఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు.