బాధితులకు బాసటగా నిలుస్తున్న నర్సులు
పగలు తేడా లేకుండా విధులు
నర్సింగ్ డే
కొత్తగూడెం మే 11 :వారి సేవలు అనిర్వచనీయం.. ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా ముందు వారే ఉంటారు. విపత్కార పరిస్థితుల్లోనూ వారిలో ఆత్మైస్థెర్యం చెక్కుచెదరలేదు.. కష్టకాలంలో సేవలకు వెనుకడుగు వేయలేదు. 24 గంటలూ బాధితులకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రికి పరుగు తీస్తే వారే అక్కున చేర్చుకొని ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తారు. బాధితులకు బాసటగా నిలుస్తూ కొండంత ధైర్యం నూరిపోస్తారు. ఆపత్కాలంలోనూ అమోఘమైన సేవలు చేస్తూ కొవిడ్ బాధితులకు భరసా కల్పిస్తున్న ఏఎన్ఎంలకు సలాం.. నేడు నర్సింగ్ డే సందర్భంగా వారి సేవలపై కథనం.
పపంచానికి వైద్యవృత్తి ఎంత అవసరమో అందులో పనిచేసే ప్రతి అడుగూ నర్సులదే అని చెప్పాలి. వైద్యుడికి తోడు లేకపోతే అది ఆపరేషన్, కాన్పుని, చికిత్స ఇలా ప్రతి దానికి నర్సులు అవసరం. మారుమూల ప్రాంతాలకు వెళ్లి టీకాలు వేయాలంటే నర్సులు ఉండాల్సిందే. వరదలొచ్చినా.. వాగులు ఉప్పొంగినా.. కాలినడకన వెళ్లి సూదిమందులు ఇచ్చిన చరిత్ర నర్సులమ్మలదే. గర్భం దాల్చినప్పటి నుంచి ఏఎన్ఎం లేనిదే వారికి వైద్యం అందదు. మొదటి నెల నుంచి తొమ్మిది నెలల వరకు వారికి వైద్యం అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా వైద్యవృత్తిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఏఎన్ఎంలు.
అవకాశం అందరికి రాదు
పురుడు పోసిన దగ్గర నుంచి చివరి దశలో వైద్యం అందించే వరకు మా పాత్ర ప్రముఖంగా ఉంటుంది. ఏఎన్ఎంలకు తోడుగా ఆశ కార్యకర్తలు నియమితులయ్యారు. వారు చాలా ఓపికగా పనిచేస్తున్నారు. వారి సేవలకూ వెలకట్టలేం. వైద్యవృత్తి మనిషికి పునర్జన్మ లాంటిది.
జాగ్రత్తలు తీసుకోవాలి
ఎలాంటి టీకాలు అయినా వేయ్యవచ్చు. కరోనా సమయంలో వైద్య విభాగంలో పని కత్తి మీద సాము. భయంగా విధులు నిర్వహిస్తున్నాం. దేవుడి మీద భారం వేసి డ్యూటీలు చేయాలి. ఎవరికి పాజిటివ్ ఉందో తెలియని పరిస్థితి. అయినా ఓపికతో టీకాలు వేస్తున్నాం.-సుజాత ఏఎన్ఎం, సుజాతనగర్