లింగాల, అక్టోబర్ 10: సైబర్ నేరాలబారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కృష్ణయ్య పేర్కొన్నారు. మండలంలోని అప్పాయిపల్లి, ఎర్రపెంటలో ఆదివారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజలకు రకరకాలుగా ఆశ చూపించి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే టోల్ఫ్రీ నెంబర్లు 100, 155260కు ఫోన్ చేయాలన్నారు. అదేవిధంగా ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు నీలవేణి, అక్కమ్మ, ఎస్వీకే సంస్థ డైరెక్టర్ లక్ష్మణరావు, మండల కో ఆర్డినేటర్ శ్రీనివాసులు, టీఆర్ఎస్ నాయకులు మహేశ్, బాలమ్మ, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన
బల్మూరు, అక్టోబర్10: ఫోన్లో వచ్చే ప్రతి మెస్సేజ్కు ప్రజలు ఆశ పడి మోసపోవద్దని సర్పంచ్ సహదేవు సూచించారు. మండలంలోని అనంతవరం గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్రామస్తులకు సైబర్నేరాలపై ఆదివారం అవగాహన కల్పించారు.
ఫోన్లో రూ.లక్షలు వస్తాయని కాల్ చేస్తే వెంటనే హెల్ప్లైన్ నెంబర్ 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఇతరులకు చెప్పి మోసపోవొద్దన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, ఎర్రయ్య, బాలయ్య, శ్రీను, కాశన్న, బుడ్డయ్య, సాయిలు, వెంకటయ్య తదితరులు ఉన్నారు.