గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల, నవంబర్ 8: బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలో సంచారజాతులు, నాయీబ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీహాల్ నిర్మాణాలకు సోమవారం ఎమ్మెల్యే భూమిపూజ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఏనాడూ సంచార జాతులను పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సంచారజాతులకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో వారి అభివృద్ధికి కృషిచేస్తున్నారన్నారు. కమ్యూనిటీహాల్ నిర్మాణంతో సంచారజాతులు ఒకేచోట కూర్చొని సమస్యలు చర్చించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సెలూన్ దుకాణాలకు 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి వారికి చేయూతనిచ్చాడని తెలిపారు. ఏ ప్రభుత్వాలూ నా యీబ్రాహ్మణులను పట్టించుకోలేదన్నారు. గద్వాల నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించి ఫంక్షన్హాల్ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అన్నిరంగాల్లో గద్వాలను అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ విజయ్కుమార్, కౌన్సిలర్లు జయమ్మ, మురళి, నాగిరెడ్డి, నరహరి, శ్రీనివాసులు, నాగరాజు, మహేశ్, కృష్ణ, పట్టణ అధ్యక్షుడు గోవిందు, ప్రధాన కార్యదర్శి సాయిశ్యాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే ఆధ్యాత్మిక వైభవం
ధరూరు, నవంబర్ 8: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో ఆధ్యాత్మిక వైభవం నెలకొన్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ర్యాలంపాడులో వైస్ఎంపీపీ సుదర్శన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అంతకుముందు గ్రామస్తులు, వేదపండితులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో విగ్రహాలకు పూజలు చేసి ధ్వజస్తంభానికి కొబ్బరికాయ కొట్టారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని ర్యాలంపాడు రిజర్వాయర్ కొండపై నిర్మించడం గొప్ప భాగ్యమని, ఇక్కడ చూస్తుంటే ఏడుకొండల్లో కనిపించే అధ్యాత్మిక వైభవం ఉట్టి పడినట్లుందన్నారు. గ్రామస్తులందరూ కలిసిమెలిసి ఉండాల ని స్వామివారి ఆశీస్సులతో పాడిపంటలు, పిల్లల చదువులు, ఆయురారోగ్యాలతో గ్రామం ఆదర్శంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, గట్టు ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీలు, సర్పంచ్ కర్రెమ్మ, ఉప సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు చిట్టెం పురుషోత్తంరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.