జడ్చర్ల, నవంబర్ 8 : కేంద్రం ధాన్యం కొనుగోలు చే యబోమని తేల్చి చెబుతున్నదని.. అందుకు యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని మల్లెబోయిన్పల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మోడీ సర్కారు వరిని కొనబోమని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిందన్నారు. అలాగే బాయిల్డ్ రైస్ కూడా కొనను అని చెబుతున్నదని చెప్పారు. ఓ వైపు కేంద్ర ప్ర భుత్వం కొనలేమని చెబుతుంటే.. రాష్ట్రంలోని బీ జేపీ నాయకులేమో వరి పండించాలంటూ రైతుల ను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం మాట్లాడుతున్న బీజేపీ నాయకులు చేతనైతే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రంతో లెటర్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుల కు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభు త్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. ప్రతిపక్షాలు దిగజారిన రాజకీయం మానుకోవాలని హితవు పలికారు. మిగతా రా ష్ర్టాల్లో ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించి అభివృద్ధికి సహకరిస్తుంటే ఇక్కడ మాత్రం కోర్టు కేసులతో అభివృద్ధి నిరోధకులుగా మారాయని దుయ్యబట్టారు. వారికి నిజం గా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని సూచించారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు శివకుమార్, గోవర్ధన్రెడ్డి, జంగయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మయ్య, మురళి, మాజీ ఎంపీపీ వెంకటయ్య, మొగులయ్య, సర్పంచ్ పద్మమ్మ, రఘుపతిరెడ్డి, ఉమాదేవి, వెంకటేశ్, ఏఈవో నవనీత తదితరులు పాల్గొన్నారు.