సర్వం సిద్ధం చేసిన అధికారులు
నేడు లేదా రేపు ప్రారంభించే అవకాశం
పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం,జూన్ 8 : జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను మంగళవారం ఆమె పరిశీలించి, మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని బుధ, గురువారాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.రోజు వారి పరీక్షల సామర్థ్యం పని తీరు, రిపోర్ట్లు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలసుకున్నారు. సిబ్బంది వివరాలు సేకరించారు. సెంటర్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అనంతరం రిమ్స్లోని ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానలోని ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, మున్సిపల్ కమిషనర్ శైలజ, రిమ్స్ డైరెక్టర్ బల రాం నాయక్, టీఎస్ ఎంఐడీసీ ఇంజినీర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
హరితహారానికి సన్నద్ధం కావాలి
ఏడో విడుత హరితహారం కార్యక్రమానికి సన్నద్ధం కావాలని, అందుకు మొక్కలను సిద్ధం గా ఉంచుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక టీటీడీసీ సమావేశమందిరంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో మంగళవారం సమావేశమై మాట్లాడారు. జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, డీఆర్డీవో కిషన్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, ఏపీడీ రవీందర్ పాల్గొన్నారు.