మూడు రోజులుగా ఆదిలాబాద్ ట్రెజరీ ఉద్యోగులపై వేధింపులు
ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైరాం గురు
ఎదులాపురం,మే 6: మూడు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా ట్రెజరీ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్న కరీంనగర్ డిప్యూటీ డైరెక్టర్ యూ నాగరాజును సస్పెండ్ చేయాలని తెలంగాణ ట్రైజరీ గెజిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైరాంగురు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ట్రెజరీ ఉద్యోగులు గురువారం సామూహిక సెలవు పెట్టారు. ఈ మేరకు ఆదిలాబాద్ ట్రెజరీ ఉద్యోగులకు ఉమ్మడి జిల్లా ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ట్రెజరీ గెజిటెడ్ ఎంప్లాయీస్ అసొసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైరాంగురు మాట్లాడారు. కరీంనగర్ డీడీ నాగరాజుపై విచారణ జరిపించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నాగరాజు ఆదిలాబాద్ ట్రెజరీ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారన్నారు. కార్యాలంలో ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తున్న క్రమంలో అకారణంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ డీడీ,(ఎఫ్ఎస్వో) రాజేశ్వర్,ఎస్టీవో, రామాచారి పై ఇచ్చిన ఫిర్యాదును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగరాజుపై చర్యలు తీసుకోవాలంటూ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మనోహార్, ఉద్యోగులు రాఘవేందర్, ఎస్కే సిరాజ్, చంద్రమోహన్, మల్లేశ్, నవీన్ కుమార్, శరత్ చంద్ర, స్రవంతి, సుప్రజ, అన్నాపూర్, శశికళ పాల్గొన్నారు.