నూతన కార్డుదారులకు 10కిలోలు
పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు
కొత్తగా 5934 మందికి లబ్ధి
ఆలేరు టౌన్, ఆగస్టు 2 : యాదాద్రి భువనగిరి జిల్లాలో నూత న ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఈనెల 3 నుంచి ఉ చితంగా బియ్యం ఇవ్వనున్నారు. ఆగస్టు నుంచి దీపావళి వర కు 10కేజీల బియ్యం చొప్పున ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జా రీ అయ్యాయి. నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన కుటుం బాలకు యూనిట్ (లబ్ధిదారుడు)కు 10కిలోల చొప్పున, పాత కార్డుదారులకు 15కిలోల చొప్పున ఉచిత బియ్యం కోటా పం పిణీ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో పాత కార్డుదారులకు ఇప్పటికే 2నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. మొదటి నెలలో కార్డులోని యూనిట్కు 15కిలోల చొప్పున పంపిణీ చేశారు. గత నెలలో మాత్రం 10కిలోల చొప్పున మా త్రమే ఉచితంగా అందజేశారు. ఆగస్టు కోటా 10కిలోలతో పా టు జూలై నెల ఇవ్వాల్సిన 5కిలోలు కూడా కలిపి 15కిలోల బియ్యం పాత కార్డుదారులకు పంపిణీ చేస్తారు. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఉపాధి లేక ఇ బ్బందులు పడుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచి తంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించాయి. మే నెలలో అని వార్య కారణాలతో ఉచిత పంపిణీ మొదలు కాలేదు. జూన్ నెల నుంచి పంపిణీ ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 481 రేషన్ షాపులు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నూతనం గా 5934 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను అం దజేసింది. ఉచితంగా బియ్యం ఇవ్వనుండడంతో కార్డుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.