రాయపోల్/హుస్నాబాద్ టౌన్, ఆగస్టు 2 : సీఎం సహాయనిధి ద్వారా ఎంతోమందికి మేలు జరుగుతున్నదని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితా వెంకన్న అన్నారు. సోమవారం పట్టణంలోని హరి రాజవ్వతో పాటు పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితా వెంకన్న మాట్లాడుతూ వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పలువురికి సీఎంఆర్ఎఫ్ సహాయ పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అయిలేని అనితారెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ. అన్వర్, కౌన్సిలర్ పెరుక భాగ్యారెడ్డి, కో-ఆప్షన్సభ్యులు ఎండీ. అయూబ్, శంకర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బోజు రవీందర్, వాల నవీన్ తదితరులు ఉన్నారు.
రాయపోల్లో..
నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ మండల నాయకుడు చింతకింది మంజూర్ అన్నారు. సోమవారం ఆయన రాయపోల్ మండల కేంద్రంలో మహేశ్ కుటుంబానికి రూ.36 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మహ్మద్ యూ సుఫ్, నాయకులు తుడుం నర్సింగరావు, మురళీగౌడ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.