కోల్సిటీ, జూన్ 2: గోదావరిఖని నగరంలోని మర్చంట్ అసోసియేషన్ వ్యాపారులు కరోనా బాధితుల సాయానికి ముందుకు వచ్చారు. కొద్ది రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాం తంలో కరోనా బారిన పడిన వారికి రోజు రెండు పూటలా కడుపు నిండా భోజనం పెడుతున్న సామాజిక కార్యకర్త మడిపెల్లి మల్లేశ్కు చేయూత అందించారు. ఈ మేరకు లక్ష్మీనగర్లో బుధవారం మాజీ డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ చేతుల మీదుగా బియ్యం, నిత్యావసరాలు, కోడిగుడ్లు అందజేశారు. సామాజిక కార్యకర్త మల్లేశ్ను అభినందించారు. వ్యాపారులు ముందుకు వచ్చి సరుకులు సమకూర్చడం స్ఫూర్తి దాయకమని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మర్చంట్ సభ్యులు దొమ్మటి తిరుపతి గౌడ్, అవునూరి శ్రీనివాస్, పూసాల శ్రీనివాస్, కోటగిరి శ్రీకాంత్, పిట్టల శ్రీనివాస్, సందుపట్ల శ్రీనివాస్, ఆంజనేయులు, వెంకటస్వామి, సురేందర్, బాలసాని నరేశ్, జితేందర్, మణి తదితరులున్నారు.
మెడికల్ కిట్లు అందజేత
పెద్దపల్లి రూరల్, జూన్ 2: పెద్దపల్లి మండలంలో కరోనా బారిన పడి హోం ఐసొలేషన్లో ఉన్న బాధిత కుటుంబాలకు నల్ల ఫౌండేషన్ చేయూతనందించింది. మండలంలో 30 మంది కుటుంబాలను గుర్తించి కొవిడ్ మెడికల్ కిట్లను నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు ఫౌండేషన్ సభ్యులు ఇంటింటికీ వెళ్లి అందజేశారు.
కాల్వశ్రీరాంపూర్, జూన్ 2: మండలంలోని పలు గ్రామాల్లో కరోనా బారిన పడి హోం క్వారంటైన్లో ఉన్న వారికి శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత పంపిన నిత్యావసరాలను యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రామగల్ల సురేశ్ బుధవారం పంపిణీ చేసినట్లు చెప్పారు. ఆయన వెంట రాకేశ్, నిషాంత్, శ్రీకాంత్ , కుమార్ ఉన్నారు.
పాలకుర్తి, జూన్2: మండల కేంద్రంలో ఆటోడ్రైవర్లకు వ్యాపారవేత్త మాదాసు సందీప్ సహకారంతో జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, నిత్యావసర వస్తువులు అందజేశారు. లాక్డౌన్ మూ లంగా ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు 10 రోజులకు సరిపడా సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కుమార్, తిరుమలాచారి, మేరుగు నరేశ్గౌడ్, గంగన్న, ఓదన్న, లింగమూర్తి, మేరుగు లక్ష్మణ్, కమలాకర్ ఉన్నారు.
రాణాపూర్లో కేశోరాం కర్మాగారం యూనియన్ అధ్యక్షుడు బయ్యపు మనోహర్రెడ్డి కరోనా పేషెంట్లకు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా పండ్లు, చికెన్, కూరగాయలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సృజనా సదానందం, ఉప సర్పంచ్ కాదాసు శారదా తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జంక్షన్, జూన్ 2: రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు జన్మదినం సందర్భంగా పెద్దపల్లి లయన్స్ క్లబ్ సీనియ ర్ సభ్యుడు, ఐఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కావేటి రాజగోపాల్ 54 భోజన ప్యాకెట్లను పట్టణంలోని నిరుపేదలు, కరోనా బాధితులకు బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, సెక్రటరీ అయాజ్, జోనల్ చైర్మన్ జైపాల్రెడ్డి, సభ్యులు అజీజ్, డీవీఎస్ మూర్తి, ఎస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.