స్నేహితుల దినోత్సవం సందర్భంగా రూ. 2.20 లక్షల చెక్కు అందజేత
హాజరైన కరీంనగర్ అదనపు కలెక్టర్
మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
హుస్నాబాద్, ఆగస్టు 1 : ప్రమాద వశాత్తు స్నేహితుడు చనిపోగా ఆయన కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు ఆర్థికంగా ఆదుకున్నా రు. పట్టణానికి చెందిన దొమ్మాటి మల్లేశం ఇటీవల కరెంటు షాక్తో మృతి చెందాడు. ఆ యనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నా రు. మల్లేశం చనిపోవడంతో పెద్దదిక్కును కో ల్పోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు హు స్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన 1983 -84 పదో తరగతి విద్యార్థులు ముందుకొచ్చారు. ఈ మేరకు ఆదివారం హుస్నాబాద్లోని వీల్రెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన సంతాప సభలో రూ. 2.20 చెక్కు అందజేశారు. కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ ఆధ్వర్యంలో స్నేహితులు విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో 1983-84 బ్యాచ్ విద్యార్థులు అశోక్, శ్రీనివాస్, భూమ య్య, బాపురాజు, ప్రసూన, ప్రేమలత, కొమురయ్య పాల్గొన్నారు.
స్నేహితురాలి కుటుంబానికి ఆర్థిక సాయం..
కొమురవెల్లి, ఆగస్టు 1: చిన్ననాటి నుంచి చదువుకున్న స్నేహితురాలి కుటుంబానికి స్నేహితులు మేము ఉన్నామని బాసటగా నిలిచారు. మండలంలోని గురువన్నపేటలో తమతో చదువుకున్న స్నేహితురాలు పబ్బోజు మహేశ్వరి తండ్రి ఆగాచారి ఇటీవల మృతి చెందారు. స్నేహితురాలి కుటుంబాన్ని గ్రామానికి చెందిన 2009-10 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు పరామర్శించి, రూ.8వేలు అందజేశారు. గ్రామపంచాయతీ కో ఆప్షన్ సభ్యుడు గోనె వెంకటేశ్వర్రెడ్డి రూ. 5 వేలు అందజేశారు. కార్యక్రమంలో బుడిగె సుమన్గౌడ్, వైనాల తిరుపతి, పుట్ట వెంకట్, కటిక బాబు, బచ్చల ఉపేందర్, బుడిగె గణేశ్, మకిలి సురేశ్ ఉన్నారు.
డ్రైవర్ కుటుంబానికి యూనియన్ల చేయూత..
కొండపాక, ఆగస్టు 1 : మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి డ్రైవర్ల యూనియన్ తరపున రూ. 60వేల ఆర్థికసాయం అందజేశారు. కొండపాకకు చెందిన ఎలిశాల రాజు (24) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. రాజు కుటుంబానికి జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధక్షుడు అనంతుల ప్రశాంత్ రూ.10 వేలు, హనుమాన్ ట్రాక్టర్ డ్రైవర్ యూనియన్ రూ.30వేలు, శ్రీరామ ఆటోడ్రైవర్స్ యూనియన్ రూ.30 వేలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు అంకుశ్, కనకయ్య, ఏగొండ స్వామి ముదిరాజ్, యాదగిరి, మల్లేశం పాల్గొన్నారు.