బోథ్, ఏప్రిల్ 9 : సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా ఉత్సవ కమిటీ నిర్వాహకులతో వివిధ అసోసియేషన్ల ఆధ్వర్యంలో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సొనాల రామాలయంలో ఆదివారం ఉత్సవమూర్తుల విగ్రహాల ఊరేగింపు, సీతారాముల కల్యాణం, అన్నదాన కార్యక్రమం కోసం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జీవీ రమణ, ప్రధాన కార్యదర్శి రామగిరి శ్రీనివాస్, సభ్యులు వేడుకలకు ఏర్పాట్లు చేయించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు.
భీంపూర్, ఏప్రిల్ 9 : కరంజి(టీ) రామాలయంలో శ్రీ రామనవమి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం హోమం, అఖండ రామనామ సంకీర్తనలు, సీతారాముల కల్యాణం, శోభాయాత్ర, మహా అన్నదానాలు ఉంటాయని సర్పంచ్ స్వాతిక, ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీనివాస్రెడ్డి, బక్కి సతీష్యాదవ్, ఆశన్నయాదవ్, పంజాబ్రెడ్డి తెలిపారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాల కలుగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాటు చేశారు.
తాంసి, ఏప్రిల్ 9 : మండల కేంద్రంలోని శ్రీరామలింగేశ్వర, బండలనాగాపూర్, హస్నాపూర్, పొన్నారిలోని రామాలయాలు, రాముల గుట్టలోని రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఆలయాల కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం శోభాయాత్ర నిర్వహించనున్నారు.
ఉట్నూర్, ఏప్రిల్ 9: మండల కేంద్రంలోని శ్రీసాయిగురుదత్త మందిరంలో ఆదివారం నిర్వహించనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శనివారం భక్తులు ఎడ్లబండ్ల ద్వారా పచ్చని పొరక శోభాయాత్ర నిర్వహించారు. ఎడ్లబండ్ల వద్ద ఉట్నూర్ సీఐ సైదారావు, ఎస్ఐ భరత్ సుమన్ పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రోడ్డు నుంచి ఆలయం వరకు శోభాయాత్ర సాగింది. కార్యక్రమంలో నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
జైనథ్, ఏప్రిల్ 9 : మండలంలోని పిప్పర్వాడ, భోరజ్, నిరాల, పెండల్వాడ, దీపాయిగూడ, ఆడ, ఆనంద్పూర్, మాంగుర్లలో రామాలయాలను రంగురంగులతో అలంకరించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.