సెలూన్, లాండ్రీ దుకాణాలకు ఉచితంగా విద్యుత్ సరఫరాపై హర్షం
రాజాపూర్, ఏప్రిల్ 5 : మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రజక, నాయీబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యం లో సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి మాట్లాడుతూ రజకులు, నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి సెలూన్, లాండ్రీ దుకాణాలకు ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్ అందించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరహరి, కోఆప్షన్ సభ్యుడు అల్తాప్, నాయీబ్రాహ్మణ సంఘం మం డల అధ్యక్షుడు యాదగిరి, రజక సంఘం అధ్యక్షుడు శంకర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, రాజు, వెంకటయ్య పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 5 : సెలూన్, లాండ్రీ దుకాణాలకు ఉచిత విద్యుత్ అందించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం నాయీబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, రఘుపతిరెడ్డి, ఇంతియాజ్, శ్రీకాంత్, పర్మటయ్య, హఫీజ్, నాయీబ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షుడు నిరంజన్, భీమయ్య, జంగయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి శంకర్, సాంబయ్య, శ్రీనివాసులు, రమేశ్, ఆంజనేయులు, రాజు, యాదయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.