సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సేవలు అందుతున్నాయని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను మంత్రి హరీశ్రావు చేశారు. అనంతరం సమీకృత మార్కెట్, అభివృద్ధిపై మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22వేల ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జహీరాబాద్లో 50 పడకల ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడని కొనియాడారు.
సిద్దిపేట అర్బన్, జనవరి 30 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలకు పంపించలేని పేద తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గడంతోపాటు కార్పొరేట్ స్థాయి విద్య దొరుకుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంతో పాటు సకల సౌకర్యాలు కల్పిస్తే ఏటా అడ్మిషన్లు ఫుల్ అని బోర్డు పెట్టేలా పరిస్థితి ఏర్పడుతుంది. సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్కు దీటుగా సౌకర్యాలు కల్పించడంతో ఏటా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నాయి. ప్రతి పాఠశాల ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలగా మారితే ప్రైవేట్కు వెళ్లే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తూ ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి ఇందిరానగర్ పాఠశాల స్ఫూర్తిగా నిలుస్తుంది.
ఆంగ్ల మాధ్యమంలోనే బోధన..
ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను బోధిస్తున్నారు. అన్నీ ప్రభుత్వ పాఠశాలలకు ఇందిరానగర్ పాఠశాల ఆదర్శంగా నిలిచింది. గత ప్రభుత్వాల హయాంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 300 మాత్రమే ఉండేది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ, ప్రధానోపాధ్యాయుడు రామస్వామి, ఉపాధ్యాయ బృందం సమష్టి కృషితో విద్యార్థుల సంఖ్య 1236కు చేరింది. ఏటా కనీసం 350 మంది విద్యార్థులు సీటు రాక వెనుతిరిగే పరిస్థితి ఆ పాఠశాలలో కనిపిస్తుంది. 6వ తరగతి నుంచి పది వరకు ఇంగ్లిష్ మీడియంలోనే ఇక్కడ బోధిస్తున్నారు. 1236 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో మొత్తం 24 సెక్షన్లుగా విభజించి తరగతులు బోధిస్తున్నారు.
సౌకర్యాలతో పాఠశాల అభివృద్ధి..
ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు అన్ని రకాల సదుపాయాలు సమకూర్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి, ఉపాధ్యాయ బృందం సమష్టి కృషి, విద్యార్థుల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. పాఠశాల భవనాన్ని పునరుద్ధరించడంతో పాటు నాట్కో సంస్థ సహకారంతో ఆరు అదనపు తరగతులు నిర్మించారు. తరగతి గదులు సరిపోక మరిన్ని గదులు నిర్మిస్తున్నారు. ఈ-పామ్ వారి సహకారంతో పాఠశాలలో డిజిటల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాలలో సైన్స్ ల్యాబ్, అటల్ టింకరిగ్ ల్యాబ్కు భవనం, గూగుల్ ఫ్యూచర్ క్లాస్ సదుపాయం, సోలార్ పవర్ యూనిట్, మోడల్ వంటశాల, వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు. పాఠశాలలోని ప్రతి తరగతి గదికి సీసీ కెమెరాలకు అనుసంధానం చేశారు. పాఠశాలలో ప్రతి రికార్డు ఆన్లైన్లో నిక్షిప్తం చేసి ఉంచుతారు. విద్యార్థులు అన్ని రకాల పోటీ పరీక్షలు, అకాడమీ ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వడంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, సైన్స్, రోబోటిక్స్, గూగుల్ కోడింగ్, యోగా తదితర అంశాలను నేర్పిస్తారు. పాఠశాలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు లభించాయి.
‘మనఊరు-మన బడి’ గొప్ప కార్యక్రమం..
టీఆర్ఎస్ ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం తీసుకురావడం సంతోషంగా ఉంది. ఇం దిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏటా సీటు రాక 350 నుంచి 400 మంది విద్యార్థులు వెనుదిరిగిపోతారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 300 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 1236 మంది చదువుతున్నారు. మంత్రి హరీశ్రావు చొరవతో ఇందిరానగర్ పాఠశాల మరింత అభివృద్ధి చెందింది. ఈ కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లలేని పేద విద్యార్థులకు చాలా లబ్ధి చేకూరుతుంది. మంచి కార్యక్రమం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
ఇంగ్లిష్ మీడియంతో ఎంతో లాభం..
ప్రభుత్వం ‘మనఊరు -మనబడి’ కార్యక్రమం ప్రవేశపెట్టడంతో మాలాంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చదువుకోవచ్చు. భవిష్యత్లో ఏది చేయాలన్నా ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది. అందుకు చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తే భవిష్యత్లో సులువుగా ఉంటుంది. మా పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు.
ఆరో తరగతి చదువుతున్నా..
ఆదో తరగతి నుంచి ఈ పాఠశాలలోనే చదువుతున్నా. మా పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఇలా మారితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ‘మన ఊరు-మనబడి కార్యక్రమం తీసుకురావడంతో అన్ని పాఠశాలల్లో మంచి సౌకర్యాలు వచ్చి నాలాంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
-నాజియా (పదో తరగతి, ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల)