సకల వసతుల ఆలయం.. యాదాద్రి దివ్య క్షేత్రం
కొండకిందే భక్తుల వసతులు
రూ. 33.69 కోట్లతో గుండిచెరువు సుందరీకరణ
అధునాతన కల్యాణకట్ట
మాలధారణ గావించే భక్తులకు దీక్షాపరుల మండపం సిద్ధం
పవిత్ర స్నానాలకు లక్ష్మీపుష్కరిణి
అందరికీ భోజనం అందేలా అన్నదాన సత్రం
అత్యద్భుత ఆర్టీసీ బస్ టెర్మినల్
యాదాద్రి, ఏప్రిల్ 25 : యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఆధ్యాత్మికతో పాటు మానసిక ఉల్లాసం కలిగిం చేలా గండి చెరువు పరిసర ప్రాంతాన్ని అభివృద్ధి చేయను న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు గండిచెరు వు పరిసరాలను పూర్తిగా పచ్చదనంతో నింపనున్నారు. ఇం దుకోసం రూ. 33.69 కోట్ల నిధులను కేటాయించారు. ఇం దులో రూ.20.10 కోట్లతో గండిచెరువు పూడికతీత, రక్షణ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితోపాటు కు టుంబంతో గడిపేందుకు సహజ సిద్ధమైన చెట్ల పందిళ్లు, బల్లలు, పాత్వే, సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. చెరువు చుట్టూ నడకదారి నిర్మించనున్నారు. అదేవిధంగా గండిచెరువును చేరుకునేందుకు రింగ్రోడ్లను సైతం నిర్మిం చనున్నారు. మిగతా రూ.13.59 కోట్లతో గండిచెరువు పరి సర ప్రాంతాల్లో లాండ్ స్కేపింగ్ గార్డెన్లు, పూల మొక్కలు, దేవతావృక్షాలు, ఔషధ మొక్కలను నాటనున్నారు. దేశ వి దేశాల నుంచి వచ్చే భక్తులకు లేజర్షోలను తలపించే విధం గా ఫౌంటెన్లు నిర్మించనున్నారు. పరిసర ప్రాంతాల్లో ఆర్న మెంటల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు. భక్తి భావం పెంపొందించేందుకు అవగాహన సదస్సులు నిర్వ హించే విధంగా విశాలలైన హాళ్లను నిర్మించనున్నారు. గండి చెరువులో బోటు షికారు ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం కాళేశ్వరం 16 ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న నృ సింహస్వామి జలాయశం నుంచి గోదావరి జలాలను గండి చెరువులో నింపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అధునాతన కల్యాణకట్ట..
గండిచెరువు పక్కనే అధునాతన కల్యాణ కట్టను నిర్మిస్తు న్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించుకునే భ క్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా కొం డకింద లక్ష్మీ పుష్కరిణి కింది భాగంలో 2.33 ఎ కరాల స్థలంలో రూ. 20.25 కోట్ల వ్యయంతో నూ తన కల్యాణకట్టను నిర్మిస్తుండగా పనులు సాగుతు న్నాయి. మహిళలు, పురుషులకు ప్రత్యేకమైన హాల్స్ నిర్మిస్తున్నారు. ఒకేసారి 360 మంది కూర్చునేలా 9,22 2 చదరపు అడుగుల్లో పురుషులకు, 16 0 మందికి వీలుగా 4,7 63 చదరపు అ డుగుల్లో మహిళలకు నిర్మిస్తున్నారు. పు రుషులకు వేరుగా 20 స్నానాల గదులు, వేడి నీళ్లు, చల్ల నీళ్లు వేరువేరుగా నీటి స దుపాయం, బట్టలు మార్చుకునేందుకు 26 గదులను నిర్మిస్తున్నారు. స్త్రీలకు 22 స్నానాల గదులు, 86 టాయిలెట్స్, నీ ళ్లు, చల్లనీళ్లు వేరువేరుగా నీటి సదుపా యం, బట్టలు మార్చుకునేందుకు 20 గదులను నిర్మిస్తున్నారు.
దీక్షాపరుల మండపం సిద్ధం
స్వామివారి మాలధారణ గావించే భక్తుల కోసం గండిచెరువు వ ద్ద 18వేల చదరపు అడు గుల విస్తీర్ణంలో ప్రత్యే క దీక్షాపరుల మండప నిర్మాణం చేపట్టగా దాదా పుగా పూర్తయ్యింది. దీనిలో పురుషులకు ఒకటి, స్త్రీలకు ఒకటి మొత్తం రెండు హాళ్లు నిర్మించారు. పు రుషులకు 1,640 చదరపు అడుగుల్లో ఒకటి, 3,450 చదరపు అడుగుల్లో మ రోకటి నిర్మాణం చేపట్టారు. ఇందులో 9 టాయిలెట్స్, 8స్నానపు గదులు, 4 బట్ట లు మార్చుకునే గదులు, వికలాం గుల కు ప్రత్యేకంగా టాయిలెట్ నిర్మించగా 2,424 చదరపు అడుగుల విస్తీర్ణంతో స్త్రీలకు ఒక గదిని నిర్మించి 5 టాయి లెట్స్, 6 స్నానపు గదులు, 2 బట్టలు మార్చుకునే గదులు, వికలాంగుల కోసం ఒక ప్రత్యేక టాయిలెట్ను నిర్మించారు. వీటితో పాటు మెడిటేషన్ హాల్ను కూడా ప్రత్యేకంగా ని ర్మించగా దాదాపుగా పనులు తుది దశకు చేరుకున్నాయి.
అధునాతన లక్ష్మీ పుష్కరిణి
భక్తుల పవిత్ర స్నానమాచరించేందుకు యాదాద్రి కొండ కింద గండిచెరువు వద్ద అధునాతన లక్ష్మీపుష్కరిణి నిర్మా ణం చేపట్టారు. రూ. 11.55 కోట్లతో నిర్మిస్తున్న ఈ పుష్క రిణిలో ఏకకాలంలో 1500 మంది భక్తులు స్నానమాచ రించే విధంగా నిర్మాణం జరుగుతున్నాయి. మొత్తం 2.47 ఎకరాలలో పుష్కరిణీ నిర్మిస్తున్నారు. పుష్కరిణీ భవనం 59 మీటర్ల వెడల్పు, 66 మీటర్ల పొడవు తో నిర్మించారు. 43 మీటర్ల పొడవు, 16.50 మీటర్ల వెడల్పు, 4 ఫీట్ల ఎత్తు లో గుండం నిర్మిస్తున్నారు. ఇందులో 15 లక్షల లీటర్ల నీటి ని నిల్వ సామార్ధ్యంతో గుండం నిర్మాణాలు జరుగుతుం డగా పనులు తుదిదశకు చేరుకున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు గోదావరి జలాలతో పుణ్యస్నానమాచరించేలా వైటీడీఏ అ ధికారులు చర్యలు చేపడుతున్నారు. నమూనాలకు అనుగు ణంగా స్వాగత తోరణాలు, చుట్టూ డిజైనింగ్ పనులు కొ నసాగుతున్నాయి. కాళేశ్వరం 16 ప్యాకేజీలో భాగంగా బ స్వాపూర్లో నిర్మిస్తున్న నృసింహస్వామి జలాశయం నుంచి గండిచెరువులకు గోదావరి జలాలను తీసుకురానున్నారు. అక్కడి నుంచి నేరుగా లక్ష్మీపుష్కరిణికి గోదావరి జలాలు విడుదల చేసేందుకు కావాల్సిన పనులు జరుగుతున్నాయి.
రూ. 8.35 కోట్లతో అన్నదాన సత్రం
యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌక ర్యార్థం అధునాతన నిత్యాన్నదాన సత్ర భవనాన్ని నిర్మిస్తు న్నారు. కొండకింద గండిచెరువు కింది భాగంలో రెండు ఎకరాల స్థలంలో రూ. 15 కోట్ల వ్యయంతో నూతన నిత్యా న్నదాన సత్రభవనాన్ని నిర్మిస్తుండగా పనులు సాగుతున్నా యి. 2.55 ఎకరాల్లో జీ ఫ్లస్ వన్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కో హాల్లో ఏకకాలంలో 360 మంది, రెండు హాల్లో కలిపి మొత్తం 720 మంది భక్తులు భోజనం చేసే విధంగా భవన నిర్మాణం జరుగుతుండగా దీని బాధ్యతలు వెగేశ్న ఫౌండేషన్ తీసుకున్నది. ఆలయం ప్రారంభమైతే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. రోజుకు లక్షపై చిలు కు భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి అన్నదానం చేసేందుకు వీలుగా అన్నదాన సత్రం నిర్మిస్తున్నారు. తిరుమల, ద్వారక తిరుమల అన్నదాన భవ నాలు నిర్మించిన విధంగా నిర్మాణాలు చేపట్టారు.
ఆర్టీసీ బస్ టెర్మినల్..
నూతనాలయం ప్రారంభానంతరం భక్తుల తాకిడి అనుగు ణంగా ఆర్టీసీ బస్ టెర్మినల్ నిర్మాణం చేపడుతున్నారు. కొం డ కింద అన్నదాన భవనం ముందు బాగంలో సుమారు 8.39 ఎకరాల్లో ఆర్టీసీ బస్ టెర్మినల్ నిర్మిస్తున్నారు. ఇందు లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులతో పాటు యా దాద్రి కొండపైకి వెళ్లే బస్సుల ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తు న్నారు. బస్ టెర్మినల్ పూర్తిగా భక్తి భావం ఉట్టి పడే విధంగా అందమైన వివిధ దేవతామూర్తుల ప్రతిమలను అమర్చను న్నారు. బస్టాండ్లో ఏక కాలంలో 4,000 మంది భక్తులు ఉండేలా, రోజుకు 35,000 మంది భక్తుల తాకిడిని తట్టుకు నేలా నిర్మాణాలు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిం చారు. వైటీడీఏ, ఆర్అండ్బీ అధికారులు ఇందుకు కావా ల్సిన ప్రణాళికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్కు నివే దించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించిన అనం తరం నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.