ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ట్రైకార్) జీఎంగా బాధ్యతలు స్వీకరించిన శంకర్రావును అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం స్థాపించిన ట్రైకార్లో డీజీఎంగా ఎన్నో సేవలందించిన శంకర్రావు జీఎంగా పదోన్నతి పొందడం అభినందనీయమన్నారు.
ఒక గిరిజనుడు ఈ స్థానం అందుకోవడం గొప్ప విషయమని చెప్పారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. ట్రైకార్ తరపున రాష్ట్రంలో గిరిజనులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పీవీ రమణ, రాష్ట్ర అధ్యక్షుడు కంప ప్రసాద్, ప్రతినిధులు డాక్టర్ పద్మజ, హరేరామ్, శ్రీమన్నారాయణ, సతీశ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.