పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి
మనోహరాబాద్, ఏప్రిల్ 23 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం పోతారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ మాధవరెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, సీఈవో మధు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రామాయంపేటలో…
రామాయంపేట, ఏప్రిల్ 23: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించుకోవాలని రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ చంద్రం సూచించారు. శుక్రవారం రామాయంపేట మండలంలోని సుతారిపల్లి గ్రామంలో కొనుగోలు కే్ంరద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈవో నర్సింహులు, సర్పంచ్ సంధ్య, కార్యదర్శి పద్మ తదితరులున్నారు.
మల్కాపూర్లో …
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 23 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తూప్రాన్ పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి అన్నారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ దీపక్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డితో కలిసి శుక్రవారం తూప్రాన్ మండలం మల్కాపూర్లో రాజరాజేశ్వరీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహాదేవి, ఎంపీటీసీ వెంకటమ్మ, వార్డుసభ్యులు పంజాల ఆంజనేయులుగౌడ్, ఐకేపీ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.