చేర్యాల/ధూళిమిట్ట/కొమురవెల్లి/మద్దూరు, ఏప్రిల్21: రైతుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గాగిళ్లాపూర్, రేబర్తి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరను కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి అమీనాబాను, ఎంపీడీవో శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ మేక సంతోశ్కుమార్, సర్పంచ్లు బొల్లు కృష్ణవేణి, నాంపల్లి సవిత, పీఏసీఎస్ డైరక్టర్లు మేక మల్లేశం, కాటం బాలయ్య, ఉపసర్పంచ్ మేక మాధవి, ఏఈవో రాకేశ్, వీఆర్వో శివరాజం, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు. వంగపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ గంగి భాగ్యలక్ష్మి ప్రారంభించారు.
కొమురవెల్లిలో..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని పీఏపీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి అన్నారు. రసూలాబాద్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పచ్చిమండ్ల స్వామిగౌడ్, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. పీఏసీఎస్ డైరెక్టర్లు బత్తిని నర్సింహులుగౌడ్, మెరుగు కృష్ణాగౌడ్, సీఈవో రాములు ఉన్నారు.
ధూళిమిట్టలో..
ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతుల పాలిట వరమని తోర్నాల సర్పంచ్ తాళ్లపల్లి రాజమ్మ అన్నారు. పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతి రెడ్డితో కలిసి వారు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
చేర్యాలలో..
అర్జునపట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ భీంరెడ్డి మధుసూదన్రెడ్డి ప్రారంభించారు. ఐకేపీ ఏపీఎం ప్రసాద్రావు, స్నేహ గ్రామ ఐక్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.