ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి టౌన్, మే 2: కరోనా కష్టకాలంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు నష్టపోవద్దని సీఎం కేసీఆర్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ దళారుల బారినుంచి కాపాడుతున్నారని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలన్నారు. గొర్లవీడు నుంచి ఒడితెలకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎంపీపీ మందల లావణ్య కోరాగా, రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభిస్తామని, అలాగే మోరంచపై చెక్డ్యాంలు నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మందల లావణ్య, జడ్పీ వైస్చైర్మన్ కళ్లెపు శోభ, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్యాదవ్, మున్సిపల్ వైస్చైర్మన్ కొత్త హరిబాబు, సర్పంచ్ శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందల రవీందర్రెడ్డి, సీనియర్ నేత బుర్ర రమేశ్, మైనొద్దీన్, పింగిళి రవీందర్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ కౌటం లక్ష్మణ్ పాల్గొన్నారు.
నైన్పాక, గిద్దెముత్తారం గ్రామాల్లో..
చిట్యాల: కోటి ఎకరాలను మాగాణిగా మార్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నిజాంసాగర్ వరకు సాగునీరందించి రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. ఆదివారం గిద్దెముత్తారం శివారులో 632 ఎకరాలకు నీరు అందించే రూ.6.25కోట్ల విలువైన ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ పంపును ఆయన ప్రారంభించారు.
అదే శివారులో మోరంచ వాగుపై రూ.2.59 కోట్లతో చెక్డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గిద్దెముత్తారం, నైన్పాక గ్రామాల్లో ధ్యానం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కాగా, టేకుమట్ల జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి స్వగ్రామం కాల్వపల్లికి బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరగా, వెంటనే నిర్మించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిట్యాల, జడ్పీటీసీ గొర్రె సాగర్, వైస్ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్, వైస్చైర్మన్లు కుంభం క్రాంతికుమార్రెడ్డి, ఏరుకొండ గణపతి, సర్పంచ్లు పోలవేణ పోషాలు, పులి సునీత, తొట్ల లక్ష్మీఐలయ్య, ఇరిగేషన్ ఎస్ఈ సుధీర్, ఈఈ సారంగం, డీఈ ప్రసాద్, ఏఈ వాసు, ఏవో నాలికే రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
గర్మిళ్లపల్లి గ్రామంలో..
టేకుమట్ల: మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ నల్లబెల్లి రమారవీందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్గౌడ్, ఏవో శ్రీనివాస్రెడ్డి, నాయకులు రవీందర్, పోలాల సరోత్తంరెడ్డి, ఆది రఘు, మహిపాల్రెడ్డి, లచ్చిరెడ్డి, తోట గట్టయ్య, రాజు, కోటి పాల్గొన్నారు.