డోర్నకల్, ఏప్రిల్ 27: ముందస్తు జాగ్రత్తలతోనే కరోనా కట్టడి చేయవచ్చునని మహబూబాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పీవీ ప్రసాద్ అన్నారు. మంగళవారం పీహెచ్సీలో ఆశ కార్యకర్తలకు శానిటైజర్ బాటిల్స్, మాస్కులు, సబ్బులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కరోనా నియంత్రణలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ బానోత్ నెహ్రూనాయక్, కోశాధికారి వెంకట్ రెడ్డి, స్టేట్ ఎంసీ మెంబర్ రవిచందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నున్న రమణ, పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రంజిత్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వ ర్లు, తహసీల్దార్ వివేక్, ఎస్సై వాంకుడోత్ భద్రూనాయక్, సీహెచ్వో వీరాబాబు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
శానిటైజర్, మాస్కులు అందజేత..
కురవి: కురవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశ కార్యకర్తలకు మహబూబాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్, సబ్బులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పీవీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తేనే, కరోనాను నియంత్రించవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ బీ నెహ్రూనాయక్, కోశాధికారి వెంకట్ రెడ్డి, స్టేట్ ఎంసీ మెంబర్ రవిచంద్రా రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్వేత పాల్గొన్నారు.
కొత్తగూడ: కొవిడ్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ నరేశ్ సూచించారు. మండలంలోని ముందుతండాలో గ్రామంలో కరోనా బాధితులను కలిసి, ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.