మహబూబ్నగర్టౌన్, నవంబర్16: స్థానిక సంస్థల ఎన్నికల్లో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ బాధ్యత అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడి యా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేం ద్రాన్ని మంగళవారం కలెక్టర్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారానికి సంబంధించిన అంశాలను ముందుగా ఎంసీఎంసీ ద్వారా అనుమతి తీసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచా రం చేసే అంశాలకు ఎంసీఎంసీ ముందస్తు అనుమతి ఇస్తుందన్నారు. ఇందుకుగానూ అభ్యర్థులు 48గంటల ముందు ప్రచారం చేయాల్సిన అంశాలను ఎంసీఎంసీకి సమర్పించాలన్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లా షాద్నగర్, వికారాబాద్ జిల్లాలోని మూడు మండలాలు కలుపుకొని ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 1,445 వరకు ఓటర్లు ఉన్నారన్నారు. ఓటరు జాబితాను ఈ నెల 15న జిల్లాకేంద్రంతోపాటు పూర్వపు అన్ని డివిజన్ కేంద్రాలు, ప్రస్తుత జిల్లా కేంద్రాల్లో ప్రచురించినట్లు తెలిపారు. జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 20వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఈఆర్వో, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.
15 రోజుల్లో పంట రుణాలివ్వాలి
రైతులకు 15రోజుల్లో పంట రుణాలివ్వాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు బ్యాంకు అధికారులకు సూచించారు. మంగళవారం తన చాంబర్లో బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటివరకు 62శాతం ఇచ్చారని, మిగతా 38 శాతం రుణాలివ్వాలన్నారు. మండలస్థాయిలో అధికారుల సహకారంతో రుణాలు పంపిణీ చేయాలన్నారు. రైతులు, చిరువ్యాపారులు, స్వయం సహాయక మహిళా సంఘాలపై బ్యాంకర్లు దృష్టి సారించి రుణాలివ్వాలన్నారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి యూనిట్లు నెలకొల్పడంలో బ్యాంకర్లు సహకరించాలన్నారు. నాబార్డు ద్వారా గోదాంలు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం 2022-23సంవత్సరానికి రూ.4,755కోట్ల అంచనాతో రూపొందించిన మహబూబ్నగర్ జిల్లా వనరుల రుణప్రణాళికను కలెక్టర్ విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, సమాచారశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఎంసీఎంసీ సభ్యులు జగపతిరావు, ఇశ్రానాయక్, ఏవో ప్రేమ్రాజ్, డీటీసీ మేనేజర్ గోపాల్గౌడ్, ఎల్డీఎం నాగరాజు, అసిస్టెంట్ మేనేజర్ శ్రావణ్కుమార్, రాంప్రసాద్, క్రాంతి, తేజ్దీప్, నాబార్డ్ ఏజీఎం శ్రీనివాస్, డీఆర్డీవో యాదయ్య, వ్యవసాయ అధికారి సుచరిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, డీటీడీవో ఛత్రు, బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర పాల్గొన్నారు.