తేదీల వారీగా కేంద్రానికి తీసుకురావాలి
మండలంలోనే అధికంగా వరి పంటలు సాగు
కోయిల్సాగర్ కాల్వల నుంచి చెరువులను నింపాం
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
ఉందేకోడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నర్వ, ఏప్రిల్ 22 : రైతులు పండించిన వరి పంట చివరి గింజ వరకు కొనేందుకు ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని ఉందేకోడ్ లో గురువారం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ నిజాంపాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో సంగబం డ కోయిల్సాగర్ కాల్వల నుంచి చెరువులను నింపడంతో మండలంలోనే అధికంగా వరి సాగు చేసి పండించిన స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. రైతులు అధికారులు సూచించిన విధంగా తేమ శాతంతోపా టు టోకెన్ల్లో సూచించిన తేదీల్లో పంటను కొనుగోలు కేం ద్రానికి తీసుకొని వచ్చి పూర్తి మద్దతు ధరను పొందాలన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములు శెట్టి, విండో చైర్మన్ లక్ష్మీకాంత్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, సర్పంచ్ పావని, నాయకులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
మండల ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల పెండ్లికి సర్కారు ఆర్థిక సాయం అందజేస్తూ సీఎం కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ డబ్బులను లబ్ధిదారులు కుటుంబ భవిష్యత్తు అవసరాలకు ఉ పయోగపడేలా వినియోగించుకోవాలన్నా రు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వీణావతి, ఎంపీడీవో రమేశ్కుమార్, ఆర్ఐ జాఫర్ పాల్గొన్నారు.
ఆలయ భూములకు పరిరక్షణగా ఉంటాం
రోడ్డు విస్తరణలో పడమటి ఆంజనేయస్వామి ఆలయం మినహాయిం పు ఇవ్వాలని, ఆలయ భూములకు ఎల్లప్పుడు పరిరక్షణ గా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో రోడ్డు విస్తరణ గల స్థలాన్ని గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం అఖిల పక్ష నాయకులు, బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, పుర ప్రజలు హైవే నంబర్ 167లో ఆలయ స్థలం రోడ్డు విస్తరణలో మినహాయింపు ఇవ్వాలని ఎమ్మెల్యేని కో రారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ ప రిరక్షణకు ఎల్లప్పుడు అండగా ఉంటానని, రోడ్డు విస్తరణ లో ఆలయ స్థలం మినహాయిం పు కోసం అధికారులు కా ంట్రాక్టర్తో మాట్లాడి స్థలం ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని రోడ్డు విస్తరణలో మారెమ్మ ఆలయం రోడ్డు పక్కన స్థలాన్ని నిర్ణయించామన్నారు. నియోజకవర్గంలోని అన్ని మతాల ఆలయాలను కాపాడుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు, బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, పుర ప్రజలు పాల్గొన్నారు.