నర్సాపూర్,ఏప్రిల్25: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ మైనార్టీ స్కూల్ , ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాలలో మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ ఆధ్వర్య ంలో ఆదివారం శానిటైజేషన్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ మాట్లాడుతూ కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్క రూ మాస్క్ ధరించకుండా ఇంటిలోంచి బయటకు రావద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమి షనర్ అశ్రిత్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు
లింగారెడ్డిపేటలో కరోనా వ్యాక్సిన్…
మనోహరాబాద్, ఏప్రిల్ 25 : మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. గ్రామంలోని 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేశారు. భౌతిక దూరంతో పాటు మాస్క్ తప్పనిసరిగా ధరించి నిబంధనలను పా టించాలని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుగు ణమ్మ, నాయకుడు పెంటగౌడ్, ప్రజలు పాల్గొన్నారు.
రామాయంపేటలో…
రామాయంపేట, ఏప్రిల్ 25: పట్టణవాసులు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అ న్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పారిశుధ్య కార్మికులతో పిచికారీ చేయించి విలేకరులతో మాట్లాడారు. కరోనా కేసులు 30 నుంచి 40 కేసుల వస్తున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్ర మంలో కాలేరు ప్రసాద్, నవాత్ ప్రసాద్, పద్మ, అశ్విత, శంకర్, శ్రీనివాస్ తదిత రులున్నారు.
కాట్రియాల్లో …
కాట్రియాల్లో కరోనా పరీక్షలను రైతు వేదిక వద్ద 134మందికి చేశామని సూ పర్వైజర్ సునంద తెలిపారు. కాట్రియాల్లో 19, దంతెపల్లి 3, పర్వతాపూర్ లో 4 పాజిటీవ్ కేసులు నమోదైనట్లు, ప్రజలు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిం చాలని సూచించారు.
తుక్కాపూర్లో పారిశుధ్య పనులు
కొల్చారం,ఏప్రిల్ 25: మండల పరిధి లోని తుక్కాపూర్లో గ్రామ పంచా యతీ సిబ్బంది ఆదివారం పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. తుక్కాపూర్లో పలు వురికి కరోనా రావడంతో పంచాయతీ పాలకవర్గం ఊరం తా శానిటైజేషన్ చేయడంతోపాటు పరిసరాలను శుభ్రం చేయాలని తీర్మా నించారు. సర్పంచ్ మాధవి శ్రీశైలం గ్రామ పంచాయతీ సిబ్బంది చే గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రా వణాన్ని పిచికారీ చేయించారు.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, లేకుంటే రూ.1000 జరిమానా విధిస్తామని కొల్చారం పొలీస్ స్టేషన్ హౌస్ మాస్టర్ ప్రకాశ్రావు తెలిపారు. మండల పరిధిలోని పోతంశెట్పల్లి చౌరస్తా సమీపంలోని ఏడుపాయల రోడ్డు వద్ద ఆదివారం వాహన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరోనా విస్తరిస్తున్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు బందోబస్తును కట్టుదిట్టం చేశామన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత టీకాను ప్రజలు వేసుకోవాలన్నారు.