మనోహరాబాద్, ఏప్రిల్ 22 : ప్రజా సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. మే 1 నుంచి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్, ఎంపీపీ నవనీతరవి, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, ఎంపీడీవో జైపాల్రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాట్రియాల్లో వ్యాక్సినేషన్ సెంటర్
రామాయంపేట, ఏప్రిల్ 22: రామాయంపేట మండలం కాట్రియాల్లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. నిజాపేటలో గ్రామంలోని నూతనంగా నిర్మాణం చేపట్టిన రైతు వేదిక భవనంలో గ్రామ సర్పంచ్ మైలారం శ్యాములు, డీ.ధర్మారం ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ సునందలు ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సహకారంతో కాట్రియాలో వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు దయాలక్ష్మి స్వామి, సుభాశ్ రాథోడ్, భాగ్యమ్మ, ఎంపీటీసీ బుజ్జి దేవేందర్, ఉపసర్పంచ్ స్రవంతి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులున్నారు.
గుండ్రెడ్డిపల్లి, ఘనపూర్లో వాక్సిన్నేషన్ కేంద్రాలు
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 22: తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి, ఘనపూర్ గ్రామస్తులు కొవిడ్ వాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి కనబరిచారు.వృద్ధులు, దివ్యాంగులు, ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీపీ గడ్డిస్వప్న, సర్పంచ్లు శ్రీలత రాజిరెడ్డి, మిద్దింటి పుష్పనవీన్ విజ్ఞప్తి మేరకు పీహెచ్సీ డాక్టర్ ఆనంద్ రెండు గ్రామాల్లో గురువారం ప్రత్యేక కొవిడ్ వాక్సిన్ నేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది,45 ఏండ్లు పైబడిన వ్యక్తలు, వృద్ధులు, దివ్యాంగులు పాల్గొన్నారు.