పాపన్నపేట, ఫిబ్రవరి 1: రాష్ట్రంలోనే అత్యం త ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధి మంగళవారం మాఘ అమావాస్యను పురస్కరించుకొని భక్తులతో పులకరించింది.వివిధ పాయల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.ఏడుపాయల ఆలయ ఈవో సార శ్రీనివాస్ ప్రత్యేక ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేకువజామనే అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఇఫ్కోడైరెక్టర్ దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.