గతంలో కూతురు పెండ్లికి రూ. 5 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే హామీ
ప్రస్తుతం రూ. 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందజేత
వివాహం నాటికి మరో రూ .2 లక్షలు ఇస్తానని ప్రకటన
దహెగాం, ఏప్రిల్ 26 : మండలంలోని ఖర్జీ గ్రా మానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఒడీల శంక ర్ కుటుంబానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అండగా నిలిచాడు. రెండు నెలల క్రితం శంకర్ భూ వివాదంలో హత్యకు గురయ్యాడు. దీంతో అప్పుడు ఎమ్మెల్యే కోనప్ప బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. శంకర్ కూతురు పెండ్లికి సొం తంగా రూ .5 లక్షలు అందిస్తానని హామీ ఇచ్చా రు. ఈ మేరకు శంకర్ భార్య పార్వతి, కూతరు కావేరి పేరిట బ్యాంకులో రూ 3 లక్షలు ఫిక్స్డ్ డి పాజిట్ చేశాడు. ఎమ్మెలే ఆదేశాల మేరకు రైతుబం ధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్ గౌడ్ బాండ్ను సోమవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఎమ్మెల్యే కోనప్ప కార్యకర్తలను కంటికి రెప్పలాగా చూసుకుంటాడని, ఇందుకు ఇదే నిదర్శనమని వారు అన్నారు. పెండ్లి వరకు మరో రూ. 2 లక్షలు ఇస్తానని హామీనిచ్చారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ప్ర సాద్రాజు, నాయకులు తుమ్మిడ మల్లేశ్, అల్గం మల్లేశ్, నజీర్, పుప్పాల సంతోష్ పాల్గొన్నారు.