కట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 15 : ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్న వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలో సీపీఎం, పలు పార్టీల నుంచి రావిరాల మల్లయ్య ఆధ్వర్యంలో 200 మంది నాయకులు, కార్యకర్తలు గురువారం నకిరేకల్ క్యాంపు కార్యాయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెంది దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాల్లో నకిరేకల్ రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని తెలిపారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి గారి సహకారంతో నకిరేకల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.