చెన్నూర్, ఏప్రిల్ 26 : చెన్నూర్ ప్రభుత్వ దవాఖానలో ఓ వైపు వ్యాక్సినేషన్, మరో వైపు కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ నిర్ధారణ పరీక్షల కోసం పెద్ద సంఖ్యలో దవాఖానకు వస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండడంతో టీకాల కోసం పెద్ద సంఖ్యలో జనం బారులు తీరుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారందరికీ టీకాలు వేస్తున్నారు. రెండో డోస్ టీకా కూడా వేస్తున్నారు. సోమవారం దవాఖానలో 184 మందికి మొదటి డోస్, 17 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 201 మందికి కరోనా టీకాలను వేశారు. 76 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 36 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. 45 ఏండ్లు నిండిన వారు ఆధార్ కార్డుతో వచ్చి టీకాలు తీసుకోవాలని సూపరింటెండెంట్ సత్యనారాయణ కోరారు.
హాజీపూర్, ఏప్రిల్ 26 : హాజీపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 54 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు.
137 మందికి వ్యాక్సినేషన్.. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 137 మంది ప్రజలకు కొవిడ్ వ్యాక్సినేషన్ వేసినట్లు హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు తెలిపారు.
కాసిపేట, ఏప్రిల్ 26 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 31 మందికి పరీక్షలు చేయగా 9 మందికి పాజిటివ్గా తేలింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్య అధికారులు సూచించారు.
తాండూర్లో 30 మందికి పాజిటివ్
తాండూర్, ఏప్రిల్ 26 : తాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 56 మందికి పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి కుమారస్వామి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కు వాడాలని సూచించారు. పలు గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
మంచిర్యాలలో 57 మందికి కరోనా పాజిటివ్
మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 26 : జిల్లా కేంద్రంలో సోమవారం 118 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 57 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. జిల్లా ప్రభుత్వ దవాఖానలో 29, పాతమంచిర్యాల అర్బన్ హెల్త్ సెంటర్లో 14, రాజీవ్నగర్ యూపీహెచ్సీలో 14 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15 మందికి కరోనా పాజిటివ్
బెల్లంపల్లిరూరల్, ఏప్రిల్ 26: బెల్లంపల్లి తాళ్లగురిజాల పీహెచ్సీలో సోమవారం 50 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్గా గుర్తించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.