సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 1 : సంగారెడ్డి జిల్లాలోని విద్యా సంస్థలు మంగళవారం నుంచి పున:ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులందరూ ఉత్సాహంగా పాఠశాలలకు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొదటి రోజు 26.87 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్, గురుకుల పాఠశాలల్లో 26.74 శాతం విద్యార్థులు హాజరు కాగా, ఏయిడెడ్ పాఠశాలల్లో 25.05 శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 27.04 శాతం హాజరయ్యారు. విద్యాసంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థులు మాస్క్లు ధరించి తరగతులకు హాజరయ్యారు. నాంపల్లి రాజేశ్ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. చౌటకూర్ మండలంలోని శివంపేట, సుల్తాన్పూర్, సంగారెడ్డి మండలంలోని ఫసల్వాది తదితర ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. జూనియర్, డిగ్రీ కళాశాలలు కూడా తెరుచుకున్నప్పటికీ విద్యార్థుల హాజరు శాతం తగ్గింది.
తొలిరోజు 32,228 మంది విద్యార్థులు హాజరు
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 1: తొలిరోజు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 32,228 మంది విద్యార్థులు హాజరయ్యారు. మెదక్ జిల్లాలోని 923 ప్రభుత్వ పాఠశాలల్లో 86,909 మంది విద్యార్థులకు 33,872 (39.2 శాతం), 108 ప్రైవేట్ పాఠశాలల్లో 23,983 విద్యార్థులకు 8.245 (34.38శాతం) మంది హాజరయ్యారు.
సిద్దిపేటలో 42.83 శాతం హాజరు..
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 1: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మంగళవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు పాఠశాలలకు 42.83 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో ఉన్న 1217 పాఠశాలలకు మంగళవారం 1153 పాఠశాలలను పునఃప్రారంభించారు. ఇందులో 1,49,069 మంది విద్యార్థులకు 63,840 మంది హాజరై 42.83 హాజరు శాతం నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజు 44.58 హాజరుశాతం నమోదు కాగా, ప్రైవేట్ పాఠశాలల్లో 39.31 హాజరు శాతం నమోదైంది. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే హాజరుశాతం అధికంగా నమోదైంది.
తగిన జాగ్రత్తలతో పాఠశాలలు నిర్వహించాలి
కొండపాక, ఫిబ్రవరి 1 : కరోనా నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలతో పాఠశాలల నిర్వహణ జరగాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సూచించారు. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ట్రైనీ ఐఏఎస్ ప్రపుల్ దేశాయ్తో కలిసి తనిఖీ చేశా రు. మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.