లంచావతారులపై ఏసీబీ సింహస్వప్నంలా మారింది. అక్రమార్కులపై కొరడా ఝులిపిస్తున్నది. అవినీతికి రుచి మరిగిన ఎందరో అధికారుల ఆటలను కట్టడి చేసింది. లంచం డిమాండ్ చేసిన పలువురు అడ్డంగా బుక్కయ్యారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు కొందరు అక్రమ సంపాదనకు అలవాటు పడి అడ్డదారులుతొక్కుతున్నారు. వారికి వేల రూపాయల వేతనం అందిస్తున్నా డబ్బుపై వ్యామోహంతో అవినీతి జలగలు ఏసీబీ వలలో పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండేండ్లలోనే 19 మంది ఏసీబీ అధికారులకు దొరికారు. వీరిలో ఎక్కువగా రెవెన్యూ శాఖ వారే ఉన్నారు. అధికారులు ఎవరైనా పనులు చేసేందుకు లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించమని, చర్యలు తీసుకుంటామని
మహబూబ్నగర్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ నెల 19వ తేదీన నారాయణపేట జిల్లా మరికల్ తాసిల్దార్ కార్యాలయంలో సందడిగా ఉన్నది. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్కోటకు చెందిన శ్రీశైల అనే మహిళ ఆఫీస్లోకి వెళ్లింది. చనిపోయిన తన భర్త పేరిట మరికల్ మండలం పెద్దచింతకుంటలో ఉ న్న 1.7 ఎకరాలను తన పేరిట మ్యుటేషన్ చేసేందుకు తాసిల్దార్ ఎస్. శ్రీధర్కు రూ.20వేలు లంచం ఇచ్చింది. డబ్బులు దాస్తుండగా అధికారికి ఊహించని సంఘటన ఎదురైంది. ఏసీబీ అధికారులు దాడులు చే సి.. లంచం డబ్బులు స్వాధీనం చేసుకొని, సాక్ష్యాధారాలు నమోదు చే సుకున్నారు. ఈ కేసులో ఏసీబీని ఆశ్రయించిన మహిళ నిరక్షరాస్యురా లు. అనారోగ్యంతో భర్త చనిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లల పోషణ కోసం హైదరాబాద్లో పాచీ పని చేసి గడుపుతున్నది. ఇంతటి కష్టాల్లో ఉన్న మహిళతో తాసిల్దార్ రూ.40వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.25 వేలకు అంగీకరించాడు. అయితే, లాల్కోటకు చెందిన ఓ వ్యక్తి సాయంతో ఏసీబీ అధికారులకు శ్రీశైల తన బాధను చెప్పుకున్న ది. ఇంకేముంది వారు దిగి తాసిల్దార్ను పట్టుకున్నారు. సదరు అధికారిని అరెస్టు చేసేందుకు ముందే మ్యుటేషన్ చేయించి తాసిల్దార్ చేతులమీదుగా మహిళకు సర్టిఫికెట్ ఇప్పించి జైలుకు తరలించారు.
ఇలా మరికల్ కేసు ఒక్కటే కాదు.. ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు అనేక మంది లంచాలు ఆశిస్తూ ఏసీబీకి దొరికిపోతున్నా రు. రెండేండ్లలో 19 మంది అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. అయినా, అవినీతికి శుభం కార్డు పడడం లేదు. ఎక్కడో పట్టుబడితే మాకేంటి..? మా వరకు రాలేరు అనే ధీమా కనిపిస్తున్నది. కానీ, ఆశ్చర్యకరంగా ఓ ఏసీబీ కేసులో అరస్టైన వార్తను చదువుతూనే మరో అధికారి లంచం తీసుకుంటూనే పట్టుబడిన ఘటన కూడా చోటు చేసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి నెలనెలా వేలాది రూపాయలు జీతంగా పొందుతున్నా.. ఇంకా డబ్బుపై వ్యామోహం చావని లంచాగ్రేసరులు అవినీతికి దారులు పరుస్తున్నా రు. పనికో రేటు కట్టి ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ సేవలను హక్కుగా భావించి పనులు చేయించుకోవా లి. ఎవరైనా లంచం అడిగితే వారి అంతు చూసేందుకు ఏసీబీ సిద్ధంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఏసీబీని ఆశ్రయించి లంచావతారులను పట్టించాలి. పట్టుబడిన వారిలో రెవెన్యూ అధికారులే ఎ క్కువ మంది ఉన్నారు. రెండేండ్లలో 8 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది పట్టుబడ్డారంటే ఆ శాఖలో ఉన్న అవినీతిని అర్థం చేసుకోవ చ్చు. భవిష్యత్తులో టేబుల్ కింద చేతులు పెట్టాలంటే భయపడాలి.. పరిస్థితులు రావాలని ఏసీబీ అధికారులు ఆశిస్తున్నారు. ప్రజలు చేయాల్సింది ఒక్కటే అవినీతి అధికారులను ఏసీబీకి పట్టిస్తే చాలు..
ఫోన్లో ఫిర్యాదు చేసినా చర్యలు..
ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని చోట్ల అధికారులు, సిబ్బంది పనులు చేసేందుకు ఇబ్బందులు పెడుతుంటారు. పని త్వరగా కావాలంటే లంచం డిమాండ్ చేస్తారు. ఎందుకివ్వాలని ప్రశ్నించే వారి పనులు కాకుండా వేధిస్తుంటారు. విసిగిపోయిన ప్రజలు నే రుగా మా వద్దకు వస్తుంటారు. లంచం తీసుకునే అధికారికి బాధితుడు డబ్బులు ఇస్తున్న క్రమంలో నేరుగా వెళ్లి పట్టుకుంటాం. కొందరు తప్పించుకునే ప్రయత్నం చేసినా.. సాంకేతిక ఆధారాలతో అదుపులోకి తీసుకొని జైలుకు పంపిస్తాం. బాధితులకు స త్వర న్యాయం జరిగేలా చూస్తాం. ఏ అధికారి అయినా లంచం అడగడం నేరం. అలాంటి వారిపై ప్రజలు నేరుగా లేదా ఫోన్లో ఫిర్యాదు చేయొచ్చు. నా నెంబర్ 9493105609 లేదా సీఐ లిం గస్వామి 9440446204, సీఐ నర్సింహ 8332975589 నెం బర్లను సంప్రదించొచ్చు. ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాలుగేండ్లలో 45 మంది అవినీతి అధికారులపై కే సులు నమోదు చేశా. రెండేండ్లలో 19 కేసులు నమోదయ్యాయి.
ఏసీబీ దాడులు ఎవరిపై.. ఎలా..?
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ప్రభుత్వం నెలనెలా జీతం ఇస్తుంది. కానీ, పలువురు అవినీతి అధికారులు ప్రజలకు సేవలందించే క్రమంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పనులు త్వరగా చేయాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై ఏసీబీ అధికారులను నేరుగా లేదా ఫోన్లో సంప్రదించొచ్చు. వారు ఫిర్యాదుదారు వివరాలు రహస్యంగా ఉంచుతారు. అవినీతి అధికారికి లంచం ఇచ్చే క్రమంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు.
లంచాలు డిమాండ్ చేసే వారితోపాటు అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వారి సమాచారం కూడా ఏసీబీకి తెలియజేయొచ్చు. నెలకు రూ.వేలల్లో జీతం పొందే అధికారులు కొందరు రూ.కోట్లల్లో అక్రమ ఆస్తులు కూడబెడుతుంటారు. పొలాలు, స్థిరాస్తులు, బంగారం, ఖరీదైన కార్లు, లగ్జరీ జీవితాలు గడుపుతుంటారు. వారి జీతానికి జీవితానికి ఎక్కడా పొంతన ఉండదు. ఇలాంటి వారు విధి నిర్వహణలో కచ్చితంగా అక్రమాలకు పాల్పడుతున్నా.. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇలాంటి వారిపై ఏసీబీకి సమాచారం అందిస్తే.. ఆధారాలతో సహా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
డైరెక్ట్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మినహాయించి.. పదోన్నతి పొందిన అధికారులను సైతం ఏసీబీ అధికారులు అక్రమంగా లంచాలు తీసుకునే కేసుల్లో అరెస్టు చేసే అవకాశం ఉంది. డైరెక్ట్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సీబీఐ వారు మాత్రమే ఆధారాలతో అరెస్టు చేస్తారు. రాష్ట్రం పరిధిలోని అన్ని స్థాయి ఉన్నతాధికారులను అరెస్టు చేసే అధికారం ఏసీబీ అధికారులకు ఉన్నది.
ఏసీబీ కేసుల్లో అరస్టైన అధికారులకు 40 నుంచి 50 రోజులు జైలు శిక్ష పడుతుంది. తర్వాత బెయిల్పై విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కేసు నమోదైన తర్వాత రెండేండ్ల వరకు సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు ఉంటుంది. ఆ తర్వాత తిరిగి పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నది. అయితే ఐదు లేదా ఆరేండ్ల తర్వాత కేసు ట్రయల్కు వస్తుంది. శిక్ష నిరూపణ అయితే సదరు అవినీతి అధికారిని ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అలాగే ఆ ఉద్యోగి లేదా అధికారికి ప్రభుత్వం నుంచి నయాపైసా రాదు.
అధికారులు లంచాలు డిమాండ్ చేసే కేసుల్లో చాలా మేరకు ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంబంధించిన పని పూర్తి చేసిన తర్వాతే జైలుకు తీసుకుపోతారు.