మందులు, వైద్య సిబ్బంది కొరత అన్న ప్రచారంలో నిజం లేదు
గందరగోళం సృష్టించడానికే పుకార్లు
ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసే త్తా వైద్య శాఖకు ఉంది
మే 1 నుంచి వ్యాక్సిన్ను ఉధృతం చేస్తాం
సమీక్షా సమావేశంలో మంత్రులు ఈటల, జగదీశ్రెడ్డి
సూర్యాపేట, ఏప్రిల్ 20: కొవిడ్ వైరస్పై ప్రజల్లో అపోహ లు సృష్టించి భయాందోళనకు గురి చేస్తున్నారని.. ఏలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేం దర్ స్పష్టం చేశారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కరోనా వైరస్ సెకండ్ వేవ్పై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారికి ఆక్సిజన్, దవాఖానల్లో బెడ్లు సరిపడా ఉన్నాయని వారికి మెరుగైన వైద్యం అందించే భా ద్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కరోనా బారిన పడి న వారితోపాటు ప్రజల్లో మనోధైర్యాన్ని నింపే బాధ్యత వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులపై ఉందని ఆయ న స్పష్టం చేశారు.
ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యం ప్రభుత్వం వద్ద ఉందన్నారు. ప్ర భుత్వ, ప్రైవేటు దవాఖానలన్నింటినీ ప్రభు త్వం స్వాధీన పర్చుకుందని ఆయా దవాఖా నల్లో ఖాళీల వివరాలు తెలిపేందుకు డ్యాష్ బోర్డులను ప్రవేశ పెట్టే ఆలోచనలో ప్రభు త్వం ఉందన్నారు. మే 1 నుంచి వ్యాక్సిన్ కా ర్యక్రమాన్ని ఉధృతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రోజుకు 10లక్షల మందికి వ్యా క్సిన్ ఇవ్వగల శక్తి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ఉన్నదని తెలిపారు. ప్రజలను కాపాడాలన్న దే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. కరోనా కట్టడి కోసమే రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో కరోనా కట్టడిలో భాగస్వాములై కర్ఫ్యూను విజయవంతం చేయాలన్నారు.
ఆందోళన చెందకండి: మంత్రి జగదీశ్రెడ్డి
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దవాఖానల్లో ఖాళీ బెడ్స్ చా లా ఉన్నాయని ఎవరూ ఆందోళన చెందొద్దని ప్రభుత్వం వై ద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా ద వాఖానల్లో ఇప్పటివరకు కేవలం ఐదు శాతం మాత్రమే బెడ్స్ ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. అసత్య ప్ర చారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నార న్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైన వైద్య సేవలు అందించి ప్రతి ఒక్కరినీ కాపాడు కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి ఏరియా దవాఖానతో పాటు ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్ దవాఖానలన్నీ కలిపి 210 బెడ్స్ ఉండగా కొవిడ్ పేషంట్ల కోసం 50 బెడ్స్ కేటా యించారన్నారు.
అంతేకాకుండా బీబీనగర్ ఎయిమ్స్లో 80 బెడ్లు సైతం కొవిడ్ పేషంట్లకు కేటాయించామన్నారు. వీటిలో 60 బెడ్లకు ఆక్సిజన్ ఏర్పాటు చేశామన్నారు. అక్క డ ఇప్పటివరకు రోగుల సంఖ్య కేవలం 10.49శాతం మాత్రమే ఉందన్నారు. సూర్యాపేట, నల్లగొండలో అదే ప రిస్థితి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేటు దవాఖానలను సై తం ప్రభుత్వం స్వాధీనం చేసుకోని అవసరమైతే అదనపు సిబ్బందిని తీసుకోని వైద్యం అందిస్తుందన్నారు. తాత్కాలిక నియామకాల కోసం కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగు ల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమా ర్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, సూర్యా పేట కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఆయా జిల్లాల అదనపు కలెక్ట ర్లు, డీఎంహెచ్వోలు, మెడికల్ కళాశాలల, ఏరియా దవా ఖానల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.