మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
రంజాన్ గిఫ్ట్లు, షాదీముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
నిర్మల్ అర్బన్, మే 2 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని అటవీ పర్యావణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్లను నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకూ సముచిత స్థానం కల్పిస్తున్నదని చెప్పారు. నిర్మల్ జిల్లాకు ఆరువేల గిఫ్ట్ ప్యాక్లు వచ్చాయని తెలిపారు. అనంతరం ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపి, గిఫ్ట్లు అందజేశారు.
షాదీముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ద్వారా పట్టణంలోని 140 మందికి చెక్కులు మంజూరు కాగా, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని కొనియాడారు. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ,అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్వో రమేశ్ రాథోడ్, జిల్లా గ్రంథాలయ స్ంథ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, వైస్ చైర్మన్ సాజిద్, జిల్లా సంక్షేమ అధికారి స్రవంతి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులున్నారు.
విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేస్తారా ?
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 2 : కరోనా వైరస్ కారణంగా దేశంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇక్కడి ప్రజలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ను ఇక్కడి ప్రజలకు అందించకుండా విదేశాలకు ఎగుమతి చేయడం ఏమిటని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో 130 కోట్ల మంది ప్రజలు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 15 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ అందిందని తెలిపారు. ఈనెల ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వాక్సిన్ ఇస్తామని ప్రకటించిన కేంద్రం, ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈరోజు వెలువడిన ఫలితాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో చెంప చెల్లుమనేలా తీర్పు ఇచ్చారని విమర్శించారు.