తిరుమల : తిరుమల శ్రీవారికి కూరగాయల రైతులు లారీని విరాళంగా అందజేసి స్వామివారిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. కర్ణాటకలోని ముళబాగల్ మాజీ శాసనసభ్యుడు జి. మంజునాథ్తో పాటు మరో 12 మంది కూరగాయల దాతలు రూ. 30 లక్షల విలువైన లారీని తిరుమల,తిరుమపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలు లారీ తాళంచెవులను అందజేశారు.
టీటీడీ అన్నప్రసాద కార్యకలాపాలకు కూరగాయలను తీసుకెళ్లేందుకు ఈ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. కార్యక్రమంలో టీటీడీ అన్నప్రసాదం, దాతల విభాగం డిప్యూటీ ఈఓ పద్మావతి, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.