తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారం భక్తులకు వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1, 13న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే టికెట్లు జారీ చేసినట్లు చెప్పారు.
భక్తులు ఖచ్చితంగా కొవిడ్ సర్టిఫికెట్ తీసుకురావాలని స్పష్టం చేశారు. కరోనా లక్షణాలుంటే తిరుమలకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 5వేల టికెట్లు కేటాయిస్తామని, తిరుపతిలో కేటాయించే ఆఫ్లైన్ టికెట్లు కేవలం తిరుపతి వాసులకు మాత్రమేనన్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి ట్రస్ట్ భక్తులకు కూడా మహాలఘు దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతుందన్నారు. తిరుమలలో 1300 రూములు రెనోవేషన్లో ఉన్నాయని, వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులు వసతి సమస్య లేకుండా తిరుపతిలో బస చేయాలని కోరారు. గదుల అడ్వాన్స్ బుకింగ్లను రద్దు చేయడం జరుగుతుందన్నారు.
తిరుమలలో 11న సాయంత్రం నుంచి 24 గంటల పాటు గదుల కేటాయింపు ఉండదన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం బంగారు రథంపై శ్రీవారు మాఢవీధుల్లో దర్శనం ఇస్తారన్నారు. 1న చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీవారి ప్రసాదాలు అందుబాటులో ఉంటాయని వివరించారు.