అమరావతి : తిరుమల, తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం శనివారం తిరుమలలో జరుగనుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గత ఫిబ్రవరి 17న జరిగిన చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, కొత్తగా చేపట్టబోయే పనులు, కేటాయింపులు తదితర వాటిపై సమావేశం జరుగనుంది. భక్తుల విరాళాలతో నిర్మించతలపెట్టిన కాటేజ్ల కేటాయింపులపై వస్తున్న ఆరోపణలపై చర్చించే అవకాశముంది .