Tirumala Brahmotsavam | ఈ సారి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉందని ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అధికమాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందన్నారు.
ఉత్సవాల తరఫున ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో పేర్కొన్నారు. రెండుస్లారు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. స్వయంగా వచ్చే ప్రముఖలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. గరుడసేవకు వచ్చే ప్రతి ఒక్కరూ వాహనసేవను తిలకించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.