తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ.4.47 కోట్లు ఆదాయం (Hundi kanukalu) వచ్చిందని టీటీడీ ( TTD ) అధికారులు వివరించారు. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 14 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వివరించారు. ఆదివారం స్వామివారిని 68,187 మంది భక్తులు దర్శించుకోగా 25,027 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.