తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగియనుండడంతో తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి. నిన్న స్వామివారిని 78,064 మంది భక్తులు దర్శించుకోగా 33,869 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.70 ఆదాయం వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
భక్తిసాగరంలో ముంచెత్తిన అయోధ్యకాండ అఖండ పారాయణం
లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం 11వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. అయోధ్యకాండలోని 40 నుంచి 44వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 159 శ్లోకాలు, యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 184 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు డాక్టర్ రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, డాక్టర్ మారుతి శ్లోక పారాయణం చేశారు.