తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 5 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 56,344 మంది దర్శించుకోగా 17,616 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.26 కోట్లు వచ్చిందన్నారు.
10న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరువడి సన్నిధి ఉత్సవం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తిక మాసంలో చివరి ఆదివారమైన డిసెంబరు 10న తిరువడి సన్నిధి ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటలకు ఎదురు ఆంజనేయస్వామివారి మూలవర్లకు తిరుమంజనం, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను ఆంజనేయస్వామివారి సన్నిధికి వేంచేపు చేసి ఏకాంతంగా తిరుమంజనం చేపడతారని వివరించారు. ఉత్సవమూర్తులను ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళతారని వివరించారు.