తిరుమల : తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండలపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామిని ( Lord Venkateshwar ) దర్శించుకునేందుకు వచ్చిన టోకెన్లు ఉన్న భక్తులు నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,592 మంది భక్తులు దర్శించుకోగా 24,273 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 3 63 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.