తిరుమల : దేశంలోని నలుమూలల నుంచి భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు తరలివస్తున్నారు. నిన్న 54,273 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 28,089 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన వివిధ కానుకల ద్వారా టీటీడీకి హుండీ ఆదాయం కింద రూ. 4.08 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
కాగా రేపు శ్రీ శుభకృత్నామ ఉగాది సంవత్సరం సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి భక్తులకు, ఉద్యోగులకు, అర్చకులకు, ప్రజలకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పద్మావతీ వేంకటేశ్వరుల ఆశీస్సులతో భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపినాథ్ జెట్టిలు తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.